Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌ లో సావిత్రిపై బిత్తిరి సత్తి కామెంట్స్‌

By:  Tupaki Desk   |   9 July 2019 1:30 AM GMT
బిగ్‌ బాస్‌ లో సావిత్రిపై బిత్తిరి సత్తి కామెంట్స్‌
X
తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు సావిత్రి మరియు బిత్తిరి సత్తి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వి6 లోని తీన్మార్‌ అనే న్యూస్‌ బులిటెన్‌ లో వీరిద్దరు వస్తారు. అరగంట పాటు వచ్చే తీన్మార్‌ న్యూస్‌ రీడర్‌ గా సావిత్రి అలియాస్‌ శివ జ్యోతి కనిపించగా బిత్తిరి సత్తిగా చేవెళ్ల రవి కనిపిస్తున్నారు. రెండు మూడు రోజులుగా తీన్మార్‌ వార్తల్లో సావిత్రి కనిపించడం లేదు. దాంతో ఆమె గురించి గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలు నిజమేనేమో అనిపిస్తున్నాయి.

ఇదే సమయంలో చేవెళ్ల రవి కూడా సావిత్రి తీన్మార్‌ కు గుడ్‌ బై చెప్పిన విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఈ సందర్బంగా ఆయన స్పందిస్తూ.. ఇది నాకు షాకింగ్‌ విషయం. ఏదో ఒక రోజు ఇలా జరుగుతుందని తెలుసు. ఆమె ఎక్కడ ఉన్నా ఏం చేసినా కూడా సక్సెస్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆమె చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలించి మంచి భవిష్యత్తు ఆమెకు ఉండాలని కోరుకుంటున్నాను అన్నాడు.

బిత్తిరి సత్తి కామెంట్స్‌ తో సావిత్రి అలియాస్‌ జ్యోతి బిగ్‌ బాస్‌ సీజన్‌ 3లో పాల్గొనబోతున్నదనే వార్తలకు బలం చేకూరింది. మరి కొన్ని రోజుల్లో బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 ప్రారంభం కావాల్సి ఉంది. స్టార్‌ మా వారితో ఒప్పందం చేసుకోవడం వల్ల తీన్మార్‌ కు గుడ్‌ బై చెప్పినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ నిజామాబాద్‌ పిల్లగా సావిత్రి సీజన్‌ 3 లో అడుగు పెట్టబోతుంది. గత సీజన్‌ లో కూడా తెలంగాణకు బ్రాండ్‌ అంబాసిడర్‌ అనిపించే కత్తి కార్తీక.. సింగర్‌ మధు ప్రియలు పాల్గొన్న విషయం తెల్సిందే. ఈసారి సావిత్రికి ఛాన్స్‌ దక్కింది. ఈనెల 21 నుండి మూడవ సీజన్‌ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని బుల్లి తెర వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.