Begin typing your search above and press return to search.

చెత్త పెర్ఫార్మర్స్ గా ఆ ముగ్గురు..షూ పాలిష్ శిక్ష

By:  Tupaki Desk   |   12 Sep 2019 4:41 AM GMT
చెత్త పెర్ఫార్మర్స్ గా ఆ ముగ్గురు..షూ పాలిష్ శిక్ష
X
బుల్లితెర మీద సంచలనాలు సృష్టిస్తున్న రియాలిటీ షో...బిగ్ బాస్ విజయవంతంగా 52 ఎపిసోడ్ లని పూర్తి చేసుకుని బుధవారం 53 ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. మంగళవారం ఎపిసోడ్‌ లో జరిగిన ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం టాస్క్ బుధవారం కూడా కొనసాగింది. ఈ టాస్క్ లో భాగంగా దెయ్యాలుగా ఉన్న హిమజ - శిల్ప - వితిక - బాబా భాస్కర్ - రాహుల్ మనుషులుగా ఉన్న శ్రీముఖి - పునర్నవి - వరుణ్ - రవి - మహేశ్ లని చంపేసి..వారు మనుషులుగా మారిపోయారు. ఇక చనిపోయిన వారు దెయ్యాలుగా మారిపోయారు.

అయితే టాస్క్ సరిగా లేదని పునర్నవి బిగ్ బాస్ మీద ఫైర్ అవుతూ....టాస్క్ చేయకుండా కూర్చుంది. అటు శ్రీముఖి - మహేశ్ - వరుణ్ - రవిలు కూడా ఇంతటితో టాస్క్ ఆపేస్తామని చెప్పడంతో బిగ్ బాస్ టాస్క్ ముగిసినట్లు ప్రకటించాడు. ఈ టాస్క్‌లో బాబా భాస్కర్ - హిమజలు మంచి పెర్ఫామెన్స్ ఇచ్చారని.. కాని శ్రీముఖి - పునర్నవి - మహేష్ విట్టాలు ఈ టాస్క్‌ ని తేలికగా తీసుకున్నారన్నారు. అంతే కాకుండా టాస్క్ రహస్యాలను బయటకు చెప్పి నిబంధనల్ని అతిక్రమించారని అందుకు ఈ ముగ్గుర్నీ చెత్త పెర్ఫామర్స్‌ గా ప్రకటించారు.

దానికి శిక్షగా లగ్జరీ బడ్జెట్ ఈ ముగ్గురికి లభించదన్నారు. దీంతో పాటు ఈ ముగ్గురికీ మిగతా ఇంటి సభ్యుల షూలను క్లీన్ చేయాలని శిక్ష విధించారు. శ్రీముఖి ఈ పని చేయడానికి సిద్ధమవ్వగా - పున్నూ - మహేశ్ లు మాత్రం ససేమిరా అన్నారు. దీంతో టాస్క్ చేయకపోతే వచ్చే వారం ఎలిమినేషన్ కు డైరెక్ట్ గా నామినేట్ అవుతారని బిగ్ బాస్ హెచ్చరించాడు. అయిన చెత్త టాస్క్ ఇచ్చింది బిగ్ బాస్. దానికి నేను ఎందుకు షూ క్లీన్ చేయాలి అంటూ పునర్నవి ఫైర్ అయ్యింది. నన్ను పూల్‌ లోకి తోసి.. దెబ్బలు కొట్టించుకుని ఇప్పుడు శిక్ష అనుభవించాలా? నో వే.. ఏం చేస్తారో చేసుకోండి అవసరమైతే భయటకు పోతా తప్ప ఈ పని చేయనని చెప్పేసింది.

అటు మహేశ్ కూడా వేరే వాళ్ళ షూ నేను క్లీన్ చేయడం ఏంటి అని ప్రశ్నించి...నేను చేయనని చెప్పాడు. అయితే శివజ్యోతి - హిమజ సర్ది చెప్పడంతో మహేశ్ చేయడానికి సిద్ధమయ్యాడు గానీ, పున్నూ మాత్రం చేయనని చెప్పేసింది. దీంతో మహేశ్ - శ్రీముఖిలు షూ పాలిష్ చేశారు. పునర్నవి మాత్రం అలాగే ఉండిపోయింది.