Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌ పున‌ర్న‌వి అవుట్‌ బోరు బోరున ఏడ్చేసిన రాహుల్‌

By:  Tupaki Desk   |   7 Oct 2019 7:27 AM GMT
బిగ్‌ బాస్‌ పున‌ర్న‌వి అవుట్‌ బోరు బోరున ఏడ్చేసిన రాహుల్‌
X
బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ షో చివరి దశకు చేరుకోవడంతో ఊహించని ఎలిమినేషన్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇంటిలో మిగిలిన 9 మంది సభ్యులలో ఆదివారం ఎపిసోడ్లో ఒకరు బయటకు వెళ్ళిపోయి 8 మంది మిగిలారు. ఈ వారం ఎలిమినేషన్ జోన్లో వరుణ్, రాహుల్, మహేష్, పునర్నవిలు ఉన్న విషయం తెలిసిందే. వీరిలో శనివారం ఎపిసోడ్లో కింగ్ నాగార్జున రాహుల్ సేఫ్ అయినట్లు ప్రకటించారు.. ఇక ఆదివారం ఎపిసోడ్లో వరుణ్, పునర్నవి, మహేష్ మిగిలారు.

మొదట ఇంటి సభ్యులకు ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఇచ్చారు. అది పూర్తి అయ్యాక వరుణ్,మహేష్, పున్నూలకు బ్లాక్ కాఫీ ఇచ్చి తాగమని చెప్పారు. అయితే వరుణ్ కప్ లో తన నేమ్ వచ్చింది. దీంతో వరుణ్ సేఫ్ అయ్యాడు. నెక్స్ట్ మహేష్ సేఫ్ అయినట్లు ప్రకటించిన నాగార్జున పునర్నవి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. ఇక పున్నూ వెళుతూ వెళుతూ అందరికీ జాగ్రత్తలు చెప్పింది గానీ, రాహుల్ తో మాత్రం మాట్లాడలేదు. అలాగే అందరితో గ్రూపుగా ఓ ఫోటో దిగి, వరుణ్-వితికాలతో ఫోటో దిగింది గానీ రాహుల్ తో దిగలేదు. దీంతో పున్నూ వెళ్ళగానే రాహుల్ ఇంటిలో ఒంటరిగా కూర్చుని ఏడ్చాడు.

తరవాత హౌస్ నుంచి బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన పున్నూ చేత నాగ్ చిన్న టాస్క్ చేయించాడు. ఈ క్రమంలోనే చివర్లో పున్నూ..రాహుల్ తో మాట్లాడింది. అయితే నాగార్జున పున్నూ గురించి నీ ఫీలింగ్ ఏంటో పాట రూపంలో చెప్పమన్నాడు. దీంతో రాహుల్ ఏమైపోయావే అంటూ పాట పాడుతూ వెక్కి వెక్కి ఏడ్చాడు. అతన్ని కంట్రోల్ చేయడం హౌస్‌లో ఉన్న వాళ్ల వల్ల కాలేదు. పునర్నవి సైతం రాహుల్‌ని చూసి ఎమోషన్ అయ్యింది. ఇక చివరిగా పున్నూ బిగ్ బాంబ్ బాబా మీద వేసింది. బిగ్ బాంబ్ ప్రకారం బాబా ఈ వారం అలీకి సేవకుడిలా పని చేయాలి.