Begin typing your search above and press return to search.

విడాకులు తీసుకున్న బాలీవుడ్ హీరోయిన్

By:  Tupaki Desk   |   29 Feb 2020 9:30 AM GMT
విడాకులు తీసుకున్న బాలీవుడ్ హీరోయిన్
X
సినీ తారల పెళ్లిళ్లు మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలివుడ్ ఇలా ఏ ఇండస్ట్రీ తీసుకున్న సీనితారల విడాకులు ఇటీవల కాలంలో కామన్ అయిపోతున్నాయి. హీరోయిన్లకు పెళ్లిళ్లు సినిమాల్లో బాగుంటున్నాయి.. నిజజీవితంలో వారికి పెళ్లిళ్లు అచ్చిరావడం లేదడానికి ఇటీవల తారలు తీసుకుంటున్న విడాకుల కేసులు అద్దం పడుతోన్నాయి. తాజాగా పాతతరం హీరోయిన్ భాగ్యశ్రీ వివాహ బంధానికి బ్రేకప్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

‘మైనే ప్యార్ కియా’లో ‘కబూతర్ జా.. జా..జా’ అంటూ బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ భాగ్యశ్రీ. ఆమె గ్లామర్, నటనకు కుర్రకారు ఫిదా అయ్యారు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు మంచి జోడీగా పేరు తెచ్చుకుంది. భాగ్యశ్రీ తెలుగులో బాలకృష్ణతో కలిసి నటించింది. ఆమె చేసిన ఏకైక చిత్రం ‘యువరత్న రాణా’. 1990 సంవత్సరం లో వ్యాపారవేత్త అయిన హిమాలయా దుస్సానీని వివాహం చేసుకుంది. ఆ తర్వాత అప్పడప్పుడు తెరపై కన్పించింది. భర్తే ప్రపంచంగా సినిమాలకు దూరంగా ఉన్న భాగ్య శ్రీ తాజాగా భర్త నుంచి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించడంతో బాలీవుడ్ జనాలు అవాక్కవుతున్నారు.

భాగ్యశ్రీ-హిమాలయా దంపతులకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. ఆమె కుమారుడు అభిమన్యు దుస్సానీ గతేడాది ‘మర్డ్ కో దర్డ్ నహీ హోతా’ చిత్రంలో బాలీవుడ్లో అరగేట్రం చేశాడు. కాగా భాగ్యశ్రీ-హిమాలయ దంపతులు గతేడాదిన్నరగా విడిగా ఉంటున్నారు. దీంతో పరస్పర అంగీకారం తో విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. మళ్లీ ఆమె సినిమాల్లో నటించేందుకు సిద్ధ పడుతోంది. తెలుగు మూవీతోనే ఆమె రీ ఎంట్రీ ఇవ్వనుంది. ప్రభాస్ తాజా మూవీలో భాగ్యశ్రీ ప్రభాస్ తల్లిగా కనిపించబోతుంది.

ఏదిఏమైనా ఆమె పేరులో ఉన్న ‘భాగ్య’శ్రీ జీవితంలో లేకపోవడం శోచనీయంగా మారింది. భాగ్యశ్రీ మరో వివాహం చేసుకుంటుందా? లేక సింగిల్ గా ఉంటుందా అనేది మాత్రం భవిష్యత్లోనే తేలనుంది