Begin typing your search above and press return to search.

ప్రతి పైసా తెరపై కనిపిస్తుంది

By:  Tupaki Desk   |   9 Aug 2017 8:45 AM GMT
ప్రతి పైసా తెరపై కనిపిస్తుంది
X
సాధారణంగా సినిమా రంగాల్లో హీరోలుగా ఎదగలాంటి ఏ స్థాయి నుంచి కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక సినిమా తారల ఫ్యామిలీస్ నుంచి వచ్చిన హీరోలైనా సరే వారి స్థాయిలో కష్టపడితేనే స్టార్ హోదాను అందుకోగలరు. ఇప్పుడు అదే తరహాలో చాలా మంది టాలీవుడ్ హీరోలు స్టార్ హోదా కోసం కష్టపడుతున్నారు. అటువంటి వారిలో ప్రముఖ నిర్మాత బెల్లం కొండ వారి అబ్బాయి బెల్లంకొండ శ్రీనివాస్ సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అయితే ఈ నెల 11 "జయ జానకి నాయక" రిలీజ్ అవుతున్న సందర్బంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాడు ఈ హీరో.

టాప్ హీరోయిన్స్ తోనే నటించాలనుకుంటున్నారా అన్న ప్రశ్నకు శ్రీనివాస్ తనదైన శైలిలో సమాధానాన్ని ఇచ్చారు. అవును నా అవగాహనా మేరకు అటువంటి వారితో నటిస్తేనే సినిమా రంగంలో నలుగురికి తెలిస్తుంది. పైగా నేను యువ హీరోని ఇప్పుడిపుడే సినిమాలు చేస్తున్నాను.. సో స్టార్ హీరోయిన్స్ తో చేయడంలో తప్పేముంది అని సమాధానాన్ని ఇచ్చాడు. అలాగే రకుల్ ఒకరితోనే కాదని జగపతి బాబు - శరత్ వంటి స్టార్స్ తో నటిస్తున్నాని వివరించాడు శ్రీనినివాస్.

ఇక బోయపాటి గురించి చెబుతూ.. ఆయన ఒక మంచి దర్శకుడు.. ఒక హీరోని ఎలా చూపించాలో అలా చూపిస్తారు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తో తనదైన శైలిలో నటనను రాబట్టుకుంటారు.ఆయన సినిమాను చాలా బాగా తెరకెక్కించారు. అలాగే ఇందులో నేను చేసిన పాత్ర చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చాడు. అనుకున్నదానికంటే ఎక్కువ స్థాయిలో బడ్జెట్ ఉండడం గురించి కూడా శ్రీనివాస్ వివరాణ ఇచ్చాడు. ఒక కథని నమ్ముకొని ఆ సినిమాకు కావాల్సినంత మాత్రమే ఖర్చు చేసినట్లు చెప్పాడు. అలాగే నిర్మాతలు పెట్టిన ప్రతి పైసా ఖర్చు తెరపై కనిపిస్తుందని, జయ జానకి నాయక తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలియజేశాడు ఈ బెల్లంకొండ హీరో.