Begin typing your search above and press return to search.

టాలీవుడ్ పై ధ‌నుష్ క‌ర్చీఫ్ వెన‌క‌..!

By:  Tupaki Desk   |   28 Jun 2021 3:30 AM GMT
టాలీవుడ్ పై ధ‌నుష్ క‌ర్చీఫ్ వెన‌క‌..!
X
కోలీవుడ్ స్టార్ హీరోలు టాలీవుడ్ పై దండ‌యాత్రకు రెడీ అయ్యారా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. ప్ర‌స్తుత మ‌ల్టీస్టార‌ర్ ట్రెండ్ లో వ్యూహం మార్చుకుని తెలుగు చిత్ర‌సీమ‌పై దండ‌యాత్ర‌కే దిగుతున్న వైనం స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది. ఇందులో ధ‌నుష్ స్పీడ్ చూస్తుంటే ఇప్ప‌ట్లో ఆగేట్టు లేడ‌నేది ఓ గుస‌గుస‌.

తెలుగు ప‌రిశ్ర‌మ‌పై ధనుష్ డైరెక్టుగానే దండ‌యాత్ర‌కి వ‌స్తున్నారు. ఇప్ప‌టికే శేఖ‌ర్ క‌మ్ముల డైరెక్ష‌న్ లో ఓ మూవీ చేయ‌డానికి సంత‌కం చేసిన ధ‌నుష్ ఇప్పుడు మ‌రో డైరెక్ట్ తెలుగు సినిమా చేయ‌డానికి సిద్ధం అవుతున్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. త‌న సొంత నిర్మాణ సంస్థ కూడా ఈ సినీ నిర్మాణంలో భాగ‌స్వామిగా ఉండ‌నుంది. తెలుగు నుంచి యాడ్ అవ్వ‌నున్న మ‌రో బ్యాన‌ర్ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ అని గుస‌గుస‌లు వినిపిన్నాయి. అఫీషియ‌ల్ ఎనౌన్స్ మెంట్ త్వ‌ర‌లోనే రానుందని తెలుస్తోంది.

ఇక ధ‌నుష్ న‌టించిన జ‌గ‌మే తంత్రం ఇటీవ‌లే రిలీజై ఫ్లాపైన సంగ‌తి తెలిసిందే. త‌దుప‌రి హాలీవుడ్ లో ది గ్రేమ్యాన్ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. అవెంజ‌ర్స్ ద‌ర్శ‌కులు ర‌స్పో బ్ర‌ద‌ర్స్ ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. త‌దుప‌రి వ‌రుస‌గా త‌మిళ‌- తెలుగు ద్విభాషా చిత్రాల్లో న‌టించ‌నున్నారు. ఆ క్ర‌మంలోనే త‌న బ్యాన‌ర్ ని ఇటు టాలీవుడ్ లోనూ విస్త‌రించ‌నున్నార‌ని తెలుస్తోంది.