Begin typing your search above and press return to search.

నెట్ ప్లిక్స్ లోకి బెబో ఎంట్రీ..ఇక దుమారామే!

By:  Tupaki Desk   |   17 March 2022 2:30 AM GMT
నెట్ ప్లిక్స్ లోకి బెబో ఎంట్రీ..ఇక దుమారామే!
X
ఓటీటీ వ‌ర‌ల్డ్ క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. డే బై డే ఓటీటీ విస్త‌ర‌ణ అంత‌కంత‌కు పెరుగుతోంది. దీంతో సెల‌బ్రిటీలంతా ఓటీటీ కంటెట్ వైపు చూస్తున్నారు. ఇప్ప‌టికే పేరున్న బాలీవుడ్ న‌టులు చాలా మంది ఓటీటీలోనూ తెరంగేట్రం చేసారు. హీరోలు.. హీరోలయిన్లు.. క్యారెక్టర్‌ ఆర్టిస్టులు అని తేడా లేకుండా ఓటీటీ సిరీస్‌లలో నటిస్తున్నారు. ఓటీటీకి ద‌క్కుతోన్న ఆద‌ర‌ణ చూసి సొంతంగా ఓటీటీ కంపెనీలే నిర్మించ‌డానికి టాప్ స్టార్స్ రెడీ అవుతున్నారు.

ఇప్ప‌టికే కొంత మంది ఫేమ‌స్ సెల‌బ్రిటీలు కార్పోరేట్ కంపెనీల‌తో భాగ‌స్వామ్య‌మ‌య్యారు. ఇక ఓటీటీ కంటెంట్ లో న‌టించిన వారికి మంచి పారితోషికం అందుతోంది. ప్యాకేజ్ రూపంలో ఒకేసారి కోట్ల రూపాయ‌లు అందుకుంటున్నారు. ల‌క్ష‌ల నుంచి కోట్లు అందుకునే సెల‌బ్రిటీలు ఎంతో మంది ఉన్నారు. ఔత్సాహికుల ప్ర‌తిభ‌ను నిరూపించుకునేందుకు ఓటీటీ చ‌క్క‌ని వేదిక‌గా నిలుస్తోంది. సినిమా భ‌విష్య‌త్ కూడా ఓటీటీదే. ఇలా ఓటీటీ వ్య‌వ‌స్థ విస్త‌ర‌ణ వెనుక ఇన్ని కార‌ణాలున్నాయి.

అందుకే ఓటీటీలో కంటెంట్ లో న‌టించ‌డానికి ఎక్కువ మంది ఆస‌క్తి చూపిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క‌పూర్ కూడా ఓటీటీ కంటెంట్ లో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. సుజోయ్ ఘోష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఓటీటీ కంటెంట్ ద్వారా క‌రీనా లాంచ్ అవుతుంది.

కరీనా నటించబోయే ఈ ఓటీటీ సిరీస్ ని 12 స్ర్టీ ఎంట‌ర్ టైన్ మెంట్స్- నార్త‌ర్న్ లైట్ ఫిల్స్మ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జే. శేవ‌క్ర‌మి- అక్ష‌య్ పూరి నిర్మాత‌లు.

ఇంట‌ర‌నేష‌న‌ల్ స్టాండ‌ర్స్ ల్లో దీన్ని తెర‌కెక్కిస్తున్నారు. నెట్ ప్లిక్స్ అడాప్ష‌న్ తో కొరియ‌న్ ఓటీటీ ప్రాజెక్ట్ గా దీన్ని తెర‌కెక్కిస్తున్నారు. దీనికి జ‌ప‌నీస్ ర‌చ‌యిత కిగో హిగాషీనో ప‌నిచేస్తున్నారు. 'ది డివోష‌న్ ఆఫ్ స‌స్పెక్ట్ ఎక్స్' టైటిల్ తో ఈ వెబ్ సిరీస్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సిరీస్ కి సంబంధించిన ఓ ట్రైల‌ర్ ఇప్ప‌టికే నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇది ఇన్వ‌స్టిగేష‌న్ నేప‌థ్యంలో సాగే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ సిరీస్ లా అనిపిస్తుంది.

ఇలాంటి సిరీస్ ల్ని అందించ‌డం లో నెట్ ప్లిక్స్ అగ్ర‌గామి సంస్థ‌గా మార్కెట్ లో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా కరీనా ఎంట్రీతో నెట్ ప్లిక్స్ కి ఇండియాలో ఆద‌ర‌ణ మ‌రింత పెరిగే ఛాన్స్ ఉంది. ఇక క‌రీనా సినిమాల విష‌యానికి వ‌స్తే అమీర్ ఖాన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న 'లాల్ సింగ్ చ‌ద్దా'లో హీరోయిన్ గా న‌టిస్తోంది. ఆగ‌స్టులో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.