Begin typing your search above and press return to search.

ఐసోలేష‌న్ కోసం అక్క‌డికి బంగార్రాజు

By:  Tupaki Desk   |   22 Jan 2022 7:30 AM GMT
ఐసోలేష‌న్ కోసం అక్క‌డికి బంగార్రాజు
X
చాలా రోజుల త‌రువాత కింగ్ నాగార్జున `బంగార్రాజు` చిత్రంతో సూప‌ర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. 2016లో వ‌చ్చిన `సోగ్గాడే చిన్ని నాయ‌న‌` చిత్రానికి సీక్వెల్ గా తెర‌కెక్కిన ఈ చిత్రం అనూహ్యంగా `ఆర్ ఆర్ ఆర్‌` , రాధేశ్యామ్‌, భీమ్లా నాయ‌క్ సంక్రాంతి బరి నుంచి త‌ప్పుకోవ‌డంతో సోలోగా సంక్రాంతి బ‌రిలో నిలిచి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకుంది. చాలా రోజుల‌గా ఈ మూవీ కోసం ఎదురుచూసిన నాగార్జున దీని ఫ‌లితంపై ముందు నుంచి చాలా కాన్ఫిడెంట్ గా క‌నిపించారు.

చివ‌రికి ఆయ‌న న‌మ్మ‌క‌మే నిజ‌మై `బంగార్రాజు` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచి మ‌రో సారి త‌న సెంటిమెంట్ ని నిజం చేసింది. ఇందులో కింగ్ నాగార్జున తో క‌లిసి చిన బంగార్రాజు గా నాగ‌చైత‌న్య సంద‌డి చేశారు. కృతిశెట్టి హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. దీంతో కింగ్ నాగార్జున్ ఫుల్ హ్యాపీగా వున్నారు.

ఈ స‌క్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు కూడా. ఇటీవ‌ల తిరుప‌తి వెళ్లి శ్రీ‌వెంక‌టేశ్వ‌ర స్వామిని స‌తీస‌మేతంగా ద‌ర్శించుకున్న నాగార్జున స‌డ‌న్ గా ఐసోలేష‌న్ కోసం గోవా వెళుతుండ‌టం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

`బంగార్రాజు` చిత్రాన్ని ఎలాగైనా సంక్రాంతి బ‌రిలో నిల‌పాల‌ని నాగార్జున‌తో పాటు టీమ్ మెంబ‌ర్స్ అంతా రాత్రింబ‌వ‌ళ్లు రెస్ట్ లేకుండా వ‌ర్క్ చేశారు. దీంతో కొంత మందికి కోవిడ్ ఎఫెక్ట్ అయింద‌ట‌.

ఇప్ప‌టికే కొంత మంది ఐసోలేష‌న్ లోకి వెళ్లిపోయార‌ని, మ‌రి కొంత మంది త్వ‌ర‌లో ఐసోలేట్ కాబోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా హైద‌రాబాద్ లో రోజు రోజుకీ క‌రోనా కేసుల పెరిగిపోతున్న నేప‌థ్యంలో అమ‌ల‌తో క‌లిసి నాగార్జున సిటీ వ‌దిలి రెండు వారాల పాటు గోవాకు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌.

ఇప్ప‌టికే `బంగార్రాజు` ప్ర‌మోష‌న్స్ పూర్తి కావ‌డం, సినిమా విడుద‌లై రెండవ వారంలోకి ఎంట‌ర్ కావ‌డంతో ఇక ప్ర‌మోష‌న్స్ అవ‌స‌రం లేద‌ని రెండు వారాల పాటు రెస్ట్ తీసుకోవాల‌ని ముందు జాగ్ర‌త్త‌లో భాగంగా గోవాలో ప్ర‌త్యేకంగా ఐసోలేట్ కావాల‌ని త‌న బార్య అమ‌ల‌తో క‌లిసి నాగార్జున గోవా వెళ్లిపోతున్నార‌ని తెలిసింది. అక్క‌డ త‌మ‌కున్న విల్లాలో రెండు వారాలు గ‌డిపి ఆ త‌రువాత తిరిగి హైద‌రాబాద్ రావాల‌ని ప్లాన్ చేసుకున్నార‌ట‌. ఇప్ప‌టికే నాగ్ .. అమ‌ల‌తో క‌లిసి గోవాకు ప‌య‌న‌మై వుంటార‌ని చెబుతున్నారు.