Begin typing your search above and press return to search.

యువహీరోతో బాలయ్య మల్టీస్టారర్.. ఓకే చేస్తాడా..??

By:  Tupaki Desk   |   3 March 2021 5:30 AM GMT
యువహీరోతో బాలయ్య మల్టీస్టారర్.. ఓకే చేస్తాడా..??
X
టాలీవుడ్ యువహీరో నాగశౌర్య ఖాతాలో ఛలో సినిమా తర్వాత ఆ రేంజి హిట్టు పడలేదనే చెప్పాలి. ఎందుకంటే ఛలో సినిమా తర్వాత రెండు మూడు సినిమాలు విడుదలైనప్పటికీ ప్లాప్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. తను స్వయంగా కథ అందించి నటించిన అశ్వద్ధామ బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ఈ సినిమాను కూడా తన సొంత ప్రొడక్షన్ బ్యానర్ లో ప్రొడ్యూస్ చేసాడు శౌర్య. అశ్వద్ధామ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఆలోచించి సినిమాలు ఓకే చేస్తున్నాడు. నూతన దర్శకుడు సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో లక్ష్య అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ సోషల్ మీడియాలో మంచి ఆదరణ పొందుతున్నాయి. నాగశౌర్య మేకోవర్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

ప్రస్తుతం నాగశౌర్య ఓకే చేసిన సినిమాలే అరడజను పైగా ఉన్నాయట. ఒక్కో సినిమాను ఫినిష్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇవేగాక తాజాగా ఓ నూతన దర్శకుడు చెప్పిన కథను ఓకే చేసాడట శౌర్య. ఆ స్క్రిప్ట్ వినగానే నచ్చేసి ఓకే చెప్పేసాడట. అయితే మల్టీస్టారర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఓ అగ్రనటుడు పాత్ర కూడా ఉందట. ఆ పాత్రకోసం నటసింహం బాలయ్యను కలిశాడాట నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్. బాలయ్యకు స్క్రిప్ట్ నచ్చింది కానీ ఓకే చెప్పలేదట. ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ త్వరగా పట్టాలెక్కించాలనే ఆత్రంలో హీరో, నిర్మాత ఇద్దరు కలిసి కింగ్ నాగార్జునను కలిశారట. కానీ నాగ్ ఆల్రెడీ ప్రవీణ్ సత్తారు, బంగార్రాజు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అంతేగాక బిగ్ బాస్ కూడా ఉందని నో చెప్పాడట. ఇక లాభం లేదని మళ్లీ ప్రొడ్యూసర్ బాలయ్యతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. బాలయ్య నుండి రెస్పాన్స్ రావాల్సి ఉంది. చూడాలి మరి శౌర్యతో బాలయ్య ఓకే చేస్తాడో లేదో!