Begin typing your search above and press return to search.

జూమ్‌ మీటింగ్‌ లో ఆ మూవీపై క్లారిటీ ఇచ్చిన బాలయ్య

By:  Tupaki Desk   |   13 Jun 2021 5:30 AM GMT
జూమ్‌ మీటింగ్‌ లో ఆ మూవీపై క్లారిటీ ఇచ్చిన బాలయ్య
X
నందమూరి బాలకృష్ణ ఈ వయసులో కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ బాక్సాఫీస్‌ వద్ద పెద్ద యుద్దమే చేస్తున్నాడు. కరోనా వల్ల ఆయన సినిమాలు గ్యాప్ వచ్చాయి. కాని ఈ పాటికి రెండు మూడు సినిమాలను ఆయన వదిలేవాడు. ప్రస్తుతం బాలయ్య చేస్తున్న అఖండ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ సినిమా విడుదల విషయంలో కరోనా అడ్డుగా నిలిచింది. త్వరలో థియేటర్లు పునః ప్రారంభం అయితే సినిమాను వెంటనే మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

అఖండ సినిమా తర్వాత గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో సినిమా ను బాలకృష్ణ చేయబోతున్నాడు. సింహం వేట మొదలు కాబోతుంది అంటూ ఇటీవలే అధికారికంగా సినిమా గురించిన ప్రకటన చేయడం జరిగింది. ప్రస్తుతం బాలయ్య కోసం గోపీచంద్ స్క్రిప్ట్‌ వర్క్ ను చేస్తున్నాడు. మరో వైపు అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో కూడా సినిమా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఆసినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన మొన్న బర్త్‌ డే సందర్బంగా వస్తుందని భావిస్తే రాలేదు. దాంతో అనీల్ రావిపూడి సినిమా పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలో బాలయ్య ఆ విషయమై క్లారిటీ ఇచ్చాడు.

ఇటీవల అభిమానులతో బాలయ్య జూమ్‌ మీటింగ్ లో మాట్లాడాడు. అభిమానులు చేపడుతున్న కార్యక్రమాలు చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చ జరిగింది. ఆ సమయంలో బాలయ్య తన సినిమా ల గురించి కూడా మాట్లాడాడు. ఆ సమయంలోనే బాలయ్య తాను అఖండ సినిమా చేశాను అని గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాను అన్నాడు. అదే సమయంలో అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో కూడా సినిమా ఉందని బాలయ్య పేర్కొన్నాడు. కాని అది ఎప్పుడు ఉంటుందనే విషయమై క్లారిటీ ఇవ్వలేదు. అనీల్‌ రావిపూడి కూడా గతంలో ఒక ఇంటర్వ్యూలో బాలయ్య తో సినిమా ఉంటుందని పేర్కొన్న విషయం తెల్సిందే. వీరి కాంబో లో మూవీ వచ్చే ఏడాదికి మొదలు అవుతుందేమో చూడాలి.