Begin typing your search above and press return to search.

కొట్టినా.. పెట్టినా బాల‌య్యే..అభిమాని ఫ్యామిలీతో బాల‌య్య‌!

By:  Tupaki Desk   |   26 July 2022 5:40 AM GMT
కొట్టినా.. పెట్టినా బాల‌య్యే..అభిమాని ఫ్యామిలీతో బాల‌య్య‌!
X
టాలీవుడ్ లో వున్న టాప్ హీరోల్లో నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకుంటారు. కోప‌మొచ్చినా.. ఆనందమొచ్చినా బాల‌య్య‌ని త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మంటారు. ఆయ‌న ఎంత సీరియ‌స్ గా మంద‌లించినా అది అప్ప‌టి వ‌ర‌కే ఆయ‌న‌ది పసి పిల్లాడి మ‌న‌సు.. అప్పుడే తిడ‌తారు.. అవ‌స‌ర‌మైతే కొడ‌తారు కూడా..కానీ ఆప్యాయంగా ద‌గ్గ‌ర‌కు తీసుకునే తీరు ప్ర‌తీ ఒక్క‌రికీ ముచ్చ‌టేస్తుంది. బాల‌య్య గురించి ఇండ‌స్ట్రీలో ఎవ‌రిని క‌దిలించిన వినిపించే మాట‌లివి.

అయితే అభిమానులు మాత్రం కొట్టినా.. పెట్టినా.. మా బాల‌య్యే అంటున్నారు. ఆయ‌న త‌ట్టినా ప‌డ‌తాం.. వెంట‌ప‌డి కొట్టినా ప‌డ‌తాం అని బాల‌య్య అభిమానులు చాలా సంద‌ర్భాల్లో నిరూపించారు. బాల‌య్య కూడా కోపం వున్న‌ప్పుడు అభిమానులు అని కూడా చూడ‌కుండా వారిపై శివాలెత్తిన తీరు చాలా సంద‌ర్భాల్లో వైర‌ల్ అయింది కూడా. అయితే తాజా బాల‌య్య చేసిన ఓ ప‌ని ఇప్ప‌డు నెట్టింట వైర‌ల్ అవ్వ‌డ‌మే కాకుండా అభిమానుల్లో నూత‌నోత్తేజాన్ని, ఆనందాన్ని నింపుతోంది.

వివ‌రాల్లోకి వెళితే.. కోపంగా వున్న‌ప్పుడు అభిమానుల‌పై స్వైర‌విహారం చేసే నంద‌మూరి బాల‌కృష్ణ శాంతంగా వున్న‌ప్పుడు మాత్రం వారిని స‌ర్ స్రైజ్ చేస్తున్నాడు. త‌న‌ని అబిమానించే అభిమానుల‌పై ప్రేమ‌ని కురిపిస్తున్నాడు. వాళ్ల‌తో క‌లిసిపోతున్నారు. తాజాగా నంద‌మూరి బాల‌కృష్ణ ఓ అభిమాని ఇంటికి వెళ్లి ఏకంగా అత‌ని కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి భోజ‌నం చేయ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఆప్యాయంగా వారితో మ‌న‌సు విప్పి మాట్లాడారు.

దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఈ వీడియోపై అభిమానులు కామెంట్ లు చేస్తున్నారు. మా బాల‌య్య మ‌న‌సు బంగారం అంటూ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు. బాల‌య్య‌ది స్వ‌స్ఛ‌మైన మ‌న‌సు అని నెట్టింట సంబ‌రాలు చేసుకుంటున్నారు.

నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న 107వ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం క‌ర్నూలులోజ‌రుగుతోంది. క‌ర్నూలులోని ఓ హోట‌ల్ కు త‌న అభిమాన సంఘం ఆధోని అధ్య‌క్షుడు స‌జ్జాద్ జ్ఞుస్సేన్ కుటుంబాన్ని బాల‌య్య క‌ర్నూలు పిలిపించుకున్నారు. అత‌ని కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి భోజ‌నం చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది. నంద‌మూరి బాల‌కృష్ణ 'అఖండ‌' బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ త‌రువాత గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో త‌న 107వ ప్రాజెక్ట్ ని చేస్తున్న విష‌యం తెలిసిందే. శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ క‌ర్నూల్ లోని కొండారెడ్డి బురుజు ద‌గ్గ‌ర జ‌రుగుతోంది. ఇటీవ‌లే అక్క‌డ కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రించారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ అక్క‌డే జ‌రుగుతోంది.