Begin typing your search above and press return to search.

'లైగర్' సెట్ లో అడుగుపెట్టిన 'లయన్'..!

By:  Tupaki Desk   |   22 Sep 2021 7:52 AM GMT
లైగర్ సెట్ లో అడుగుపెట్టిన లయన్..!
X
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ''లైగర్''. 'సాలా క్రాస్ బ్రీడ్' అనేది దీనికి ట్యాగ్ లైన్. మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. కీలమైన బాక్సింగ్ సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరిస్తున్నారు. అయితే తాజాగా 'లైగర్' సెట్ లో లయన్ అడుగుపెట్టినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం గోవాలో ఉన్న నటసింహం నందమూరి బాలకృష్ణ ఈరోజు బుధవారం ఉదయం 'లైగర్' సెట్స్ కు వెళ్లి అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఈ సందర్భంగా హీరో మరియు దర్శక నిర్మాతలతో బాలయ్య కాసేపు ముచ్చటించారు. లెజెండ్ బాలకృష్ణ చిత్ర బృందానికి బెస్ట్ అందించినట్లు పేర్కొంటూ దీనికి సంబంధించిన ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో బాలయ్య తో పాటుగా విజయ్ దేవరకొండ - పూరీ జగన్నాథ్ - ఛార్మీ కౌర్ ఉన్నారు.

బాలకృష్ణ - పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో 'పైసా వసూల్' అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తీసే క్రమంలో ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి మరో ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు బాలయ్య ఇటీవల వెల్లడించారు. ఇక ఛార్మీ 'అల్లరి పిడుగు' అనే సినిమాలో నటసింహం సరసన హీరోయిన్ గా ఆడిపాడింది. కాగా, ''లైగర్'' చిత్రాన్ని పూరి కనెక్ట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ మీద పూరి జగన్నాధ్ - ఛార్మి కౌర్ - కరణ్ జోహార్ మరియు అపూర్వ మెహతా కలసి నిర్మిస్తున్నారు.

ఇందులో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తోంది. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. జునైద్ సిద్దిఖీ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.మ్. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండీ లాంగ్ ఈ సినిమాలో బాక్సింగ్ సీక్వెన్స్ డిజైన్ చేసాడు. పూరీ జగన్నాథ్ మరియు విజయ్ దేవరకొండ లు కలసి చేసున్న ఈ చిత్రాన్ని తెలుగు హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్నారు.