Begin typing your search above and press return to search.

మనిషి జీవితంలో సినిమా ఒక భాగం.. అన్ని నేనే చేస్తానని అనుకోకూడదు..!

By:  Tupaki Desk   |   31 Oct 2022 3:47 AM GMT
మనిషి జీవితంలో సినిమా ఒక భాగం.. అన్ని నేనే చేస్తానని అనుకోకూడదు..!
X
అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయెల్ జంటగా రాకేశ్ శశి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఊర్వశివో రాక్షసివో.. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ నిర్మిస్తున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అన్ స్టాపబుల్ షోతో నందమూరి అల్లు ఫ్యామిలీ మధ్య బంధం బలపడ్డది. అంతకుముందు కూడా ఈ ఫ్యామిలీల మధ్య సత్సంబంధాలు ఉన్నా ఆహా అన్ స్టాపబుల్ షోతో మరింత స్ట్రాంగ్ అయ్యింది.

ఈ క్రమంలో అల్లు శిరీశ్ సినిమా ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చారు బాలయ్య బాబు. మైక్ అందుకోవడమే ఎగరేసి పట్టుకుని అది మన స్టైల్.. సిగ్నేచర్ అంటూ అదరగొట్టిన బాలకృష్ణ అలా తిప్పందే వాళ్లు ఊరుకోరని అభిమానులను ఉద్దేశించి అన్నారు. ముందుగా తమని తాము ఆవిష్కరిస్తున్న ఈతరం దర్శకులు మంచి సినిమాలు తీస్తున్నారని వారితో పాటుగా ఈ వేడుకకు వచ్చిన నందమూరి అల్లు అభిమానులకు కళాకారులకు కళాభివందనాలు తెలియచేశారు.

అల్లు అరవింద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేయనవసరం లేదు కొత్తగా వస్తున్న ధీరజ్ వాళ్లకి తన కృతజ్ఞతలు చెబుతున్నా అని అన్నారు. అల్లు ఫ్యామిలీ తమ ఫ్యామిలీ ఒక్కటే అని.. ఇంకా అల్లు రామలింగయ్య గారితో తమ ఫ్యామిలీకి చాలా అనుబంధం ఉందని అన్నారు బాలయ్య. రామలింగయ్య గారితో చాలా సినిమాలు చేశానని.. ఆయనకు నేనంటే భయమని అన్నారు బాలకృష్ణ. ఓ సినిమాలో మీసం కోసం మేకప్ మెన్ ప్రయత్నిస్తుంటే ఆయన తలతిప్పుకుంటున్నారని ఆ టైం లో నేను అరిచానని అన్నారు. అల్లు ఫ్యామిలీతో తమకు చాలా మంచి సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు బాలకృష్ణ.

ఇక సినిమా గురించి మాట్లాడుతూ ఊర్వశివో రాక్షసివో సినిమాలో మంచి మసాలా ఉన్నట్టుంది. శిరీష్ కేవలం సినిమాలోనేనా లేక బయట కూడా అంతేనా.. కన్నవారిగా కాదు విన్న వాడిగా అడుగుతున్నా అని సరదాగా అల్లు శిరీష్ ని ఆటపట్టించారు బాలకృష్ణ. తన టాక్ షోకి పిలిపించి అన్ని బయటకు లాగుతానని అన్నారు. ఇక తన కుర్చీకే ఎసరు పెట్టాలని చూశాడని.. ఆ విషయాలని కూడా టాక్ షోకి వచ్చాక ప్రస్థావిస్తానని అన్నారు బాలయ్య. సినిమా ట్రైలర్ చాలా బాగుంది.. సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుతున్నానని అన్నారు.

డైరక్టర్ రాజేశ్ శషికి మ్యూజిక్ డైరక్టర్ అచ్చు.. కెమెరా మెన్ లకు మంచి విజయం అందించాలని అన్నారు బాలయ్య బాబు. సినిమా ట్రైలర్ చూస్తుంటే చాలా కలర్ ఫుల్ గా ఉందని అనిపిస్తుంది. మనిషి తన దైనందన జీవితంలో సినిమా ఒక భాగం అయ్యిందని.. అందుకే వారిని అలరించే సినిమాలు తీయాల్సిన అవసరం అందరి మీద ఉందని అన్నారు.

ఎవరికి ఏ పాత్రలు సూటవుతాయో అవే చేయాలి.. అన్ని చేసేస్తా అంటే సరిపోదు. మన ఇమేజ్ కి తగిన సినిమాలు చేయాలని. తను వేరే ఏమైనా ప్రయోగాలు చేద్దామన్నా సరే తన అభిమానులు ఒప్పుకోరని అన్నారు బాలకృష్ణ. ఇక సినిమాలో హీరోయిన్ అందంగా ఉందని అందంతో పాటు అభినయం కూడా బాగా చేసిందనిపిస్తుంది. హీరో హీరోయిన్ మధ్య రొమాన్స్ బాగుందని.. సినిమా తప్పకుండా మంచి విజయం సాధించాలని.. సాధిస్తుందని అలా సినిమాను దీవిస్తున్నానని అన్నారు బాలయ్య. చివరగా కూడా ఈ వేడుకకు వచ్చిన వారికి.. నందమూరి, అల్లు అభిమానులకు ధన్యవాదాలు తెలిపి తన స్పీచ్ ముగించారు బాలయ్య. ఇక బాలయ స్పీచ్ ముగించగానే సార్ నేనొక మాట చెప్పాలంటూ మైక్ అందుకుని జై బాలయ్య అని నందమూరి అభిమానుల్లో ఉత్సాహం నింపారు అల్లు శిరీశ్.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.