Begin typing your search above and press return to search.

హీరోని నాలుగుసార్లు త‌న్నింద‌ట‌

By:  Tupaki Desk   |   24 Jan 2016 1:30 PM GMT
హీరోని నాలుగుసార్లు త‌న్నింద‌ట‌
X
శ‌ర‌త్‌ కుమార్ కూతురుగా కంటే క‌థానాయ‌కుడు విశాల్‌ కి స‌న్నిహితురాలిగా పాపుల‌ర్ అయింది వ‌ర‌ల‌క్ష్మి. ప్ర‌స్తుతం ఆమె త‌మిళంలో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇటీవ‌లే బాలా ద‌ర్శ‌క‌త్వంలో తారై త‌ప‌టై అనే చిత్రంలో న‌టించింది. సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఆ సినిమా మిక్స్‌ డ్ రివ్యూస్‌ ని తెచ్చుకొంది. అయితే అందులో క‌థానాయిక‌గా న‌టించిన వ‌ర‌ల‌క్ష్మికి మాత్రం మంచి మార్కులు ప‌డ్డాయి. స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో అద‌ర‌గొట్టిందని వ‌ర‌లక్ష్మికి ప్ర‌శంస‌లొచ్చాయి. బాలా సినిమాలంటేనే ప‌క్కా నాచుర‌ల్‌ గా ఉంటాయి. థియేట‌ర్‌ లో ఉన్న‌ప్ప‌టికీ ఒక్కోసారి మ‌నం సినిమా చూస్తున్నామ‌నే విష‌యం కూడా గుర్తుండదు. అంత నేచురాలిటీతో సినిమాలు తీస్తుంటాడు బాలా. త‌ను అనుకొన్న సన్నివేశం వ‌చ్చేంత‌వ‌ర‌కు న‌టీన‌టుల్ని కూడా ముప్పుతిప్ప‌లు పెడుతుంటాడ‌ని చెబుతుంటారు త‌మిళ సినీ జ‌నాలు.

ఒక‌ప‌ట్టాన సంతృప్తి చెంద‌ని బాలా సెట్లో వ‌ర‌ల‌క్ష్మి న‌ట‌న‌ని చూసి త‌న గొంతులో ఉన్న బంగారు గొలుసుని తీసి బ‌హుమ‌తిగా అంద‌జేశాడ‌ట‌. ఆ విష‌యం గురించి ఇటీవ‌ల మీడియాకి వెల్ల‌డించింది వ‌ర‌లక్ష్మి. త‌మిళంలో క‌ర‌క‌ట్టం అనే సంప్ర‌దాయ నృత్యం ఆధారంగా తెర‌కెక్కిన తారై త‌పటై కోసం ప్ర‌ధాన పాత్ర‌ధారులైన శ‌శికుమార్‌ - వ‌ర‌ల‌క్ష్మి చాలా క‌ష్ట‌ప‌డ్డార‌ట‌. ఇందులో ఓ స‌న్నివేశం గురించి వ‌ర‌లక్ష్మి ప్ర‌త్యేకంగా చెబుతోంది. ``సినిమాలో శ‌శికుమార్‌ ని కాలితో త‌న్నాల్సిన స‌న్నివేశం ఒక‌టుంది. నిజంగానే గ‌ట్టిగా త‌న్నేయ‌మ‌ని నాకు బాలాసార్ చెప్పాడు. అది ఒక్క షాట్లో పూర్త‌యింటే బాగుండేది. కానీ బాలాసార్‌ కి మాత్రం తొంద‌రగా న‌చ్చ‌లేదు. దీంతో నేను నాలుగుసార్లు శ‌శికుమార్‌ ని గ‌ట్టిగా త‌న్నా. ఆయ‌న కూడా అస్స‌లు ఏమీ అనుకోలేదు`` అని చెప్పుకొచ్చింది వ‌ర‌ల‌క్ష్మి. త‌న స్నేహితుడైన విశాల్‌ కి సినిమా చూపించేశాన‌ని తెలిపింది వ‌ర‌లక్ష్మి.