Begin typing your search above and press return to search.

రెజీనాకు ఫోన్ చేసిన బాహుబ‌లి నిర్మాత‌లు..!

By:  Tupaki Desk   |   12 April 2021 11:30 AM GMT
రెజీనాకు ఫోన్ చేసిన బాహుబ‌లి నిర్మాత‌లు..!
X
ఎంత టాలెంట్ ఉన్నా.. సినిమా ఇండ‌స్ట్రీలో ఎద‌గాలంటే అదృష్టం కూడా క‌లిసి రావాలంటారు. రెజీనా క‌సాండ్ర‌ను చూస్తే నిజ‌మే అనిపిస్తుంది. ఎంతో టాలెంటెడ్ యాక్ట్రెస్ అయిన రెజీనా.. చాలా సినిమాల్లో న‌టించింది. త‌న ప్ర‌తిభ‌ను కూడా చాటుకుంది. కానీ.. అగ్ర‌స్థానానికి చేర‌లేక‌పోయింది.

రవితేజ లాంటి సీనియర్ హీరోలతోపాటు సాయి ధరమ్ తేజ్, నాగ శౌర్య లాంటి కుర్ర హీరోలతోనూ ఆడిపాడింది. అయినప్పటికీ.. రెజీనా జాతకం మారలేదు. ప్ర‌స్తుతం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఓ హార‌ర్ మూవీలో న‌టిస్తోంది. కోలీవుడ్ లో ‘శూర్పణగై’ అనే టైటిల్‌ ఫిక్స్ చేసిన ఈ చిత్రం.. తెలుగులో ‘నేనేనా’ పేరుతో వస్తోంది.

అయితే.. లేటెస్ట్ అప్డేట్ ఏమంటే.. బాహుబ‌లితో ప్ర‌పంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత‌లు శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని డిజిట‌ల్ రంగంలోకి అడుగు పెడుతున్న‌ట్టు స‌మాచారం. బుల్లితెర‌పైనా సీరియ‌ల్స్ నిర్మిస్తూ వ‌స్తున్న వీరు.. త్వ‌ర‌లో ఓటీటీ వేదిక‌గా ఓ వెబ్ సిరీస్ ప్రారంభించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.

ఇది కూడా హార‌ర్ బేస్ గా రూపొంద‌నున్న‌ట్టు స‌మాచారం. ఇందులో రెజీనా లీడ్ రోల్ లో క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ మేర‌కు రెజీనాతో సంప్ర‌దింపులు కూడా జ‌రిగిన‌ట్టు స‌మాచారం. ఇందుకు సంబంధించిన వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు. మ‌రి, ఈ చిత్రాలతోనైనా రెజీనా కెరీర్ టాప్ గేర్ అందుకుంటుందేమో చూడాలి.