Begin typing your search above and press return to search.

500 మందిలో వెనుక అప్పుడు.. సోలోగా పక్కనే ఇప్పుడు

By:  Tupaki Desk   |   18 July 2021 8:30 AM GMT
500 మందిలో వెనుక అప్పుడు.. సోలోగా పక్కనే ఇప్పుడు
X
సినిమా పరిశ్రమలో కష్టపడి పని చేసే వారికి ఏదో ఒక సందర్బంలో ఫలితం దక్కుతుంది. కొందరు గుర్తింపు దక్కించుకుని ఒక స్థాయికి చేరుకుంటే మరి కొందరు అదృష్టం తోడైతే స్టార్‌ లుగా సూపర్ స్టార్‌ లుగా కూడా మారిపోయిన సందర్బాలు చాలా ఉన్నాయి. కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్ ఒక సాదా సీదా డాన్సర్ గా సినీ కెరీర్‌ ను ఆరంభించాడు. స్టేజ్ షో లు ఇస్తూ కెరీర్‌ ఆరంభంలో అత్యంత దుర్బేధ్యమైన పరిస్థితులను అనుభవించాడు. అలాంటి జానీ మాస్టర్‌ ఇప్పుడు టాలీవుడ్‌ లో మోస్ట్‌ హ్యాపెనింగ్‌ డాన్స్ మాస్టర్ గా పేరు దక్కించుకున్నాడు.

కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా ఈయన స్టెప్పులు ఇతర భాషల్లో కూడా పాపులర్ అవుతున్నాయి. అలాంటి జానీ మాస్టర్ ప్రస్తుతం తన అభిమాన హీరో రామ్‌ చరణ్‌ చేయబోతున్న ప్రతిష్టాత్మక మూవీ లో భాగస్వామ్యం కాబోతున్నాడు. ఆవిషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్‌ చేస్తూ జానీ మాస్టర్‌ ఎమోషనల్‌ అయ్యాడు. శంకర్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ హీరోగా దిల్ రాజు నిర్మించబోతున్న సినిమా లోని పాటలకు జానీ మాస్టర్‌ కొరియోగ్రఫర్ గా వర్క్‌ చేయబోతున్నాడు. ఆ విషయం అధికారికంగా కన్ఫర్మ్‌ అయ్యింది. దర్శకుడు శంకర్‌ తో ఇటీవలే జానీ మాస్టర్‌ చర్చలు జరిపాడు.

సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ లో భాగంగా దర్శకుడు శంకర్‌ ను జానీ మాస్టర్ కలిశాడు. ఆ సందర్బంగా తీసుకున్న ఫొటోను షేర్‌ చేశాడు. దాంతో పాటు స్టేజ్ షో లు ఇచ్చే సమయంలో ముక్కాల పాట కు డాన్స్‌ వేయడం మొదలుకుని బాయ్స్ సినిమా లో 500 మంది డాన్సర్స్‌ లో వెనుక నిలబడ్డ నేను ఆ సమయంలోనే శంకర్‌ సర్‌ అంటే చాలా ఇష్టపడేవాడిని. అలాంటి శంకర్ సర్ మూవీ కి సోలో కొరియోగ్రాఫర్‌ గా అవకాశం దక్కించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను అంటూ ఆయన పక్కన నిల్చున ఫొటోను ఇలా షేర్‌ చేశాడు. ఒకప్పుడు ఆయన తెరకెక్కించిన సినిమాలో 500 మంది డాన్సర్స్ లో ఒక డాన్సర్ గా నిలిచిన జానీ మాస్టర్ ఇప్పుడు రామ్‌ చరణ్‌ నమ్మకం పెట్టుకుని శంకర్‌ సినిమా కు సోలో కొరియోగ్రాఫర్‌ గా ఎంపిక అయ్యాడు.

కష్టపడితే కెరీర్‌ లో మంచి పొజీషన్ కు వెళ్లవచ్చు అనేందుకు జానీ మాస్టర్ చక్కని నిదర్శనం అంటూ ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. రామ్‌ చరణ్‌ ప్రస్తుతం చేస్తున్న ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా షూటింగ్‌ పూర్తి అయిన వెంటనే శంకర్ మూవీ లో జాయిన్ అవ్వబోతున్నాడు. ఆగస్టు లేదా సెప్టెంబర్‌ లో సినిమా ను పట్టాలెక్కించి వచ్చే ఏడాది వరకు పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమా లో హీరోయిన్ ఎవరు అనే విషయం లో ఇంకా స్పష్టత రాలేదు. ఇక ఈ సినిమా కు ప్రముఖ రచయిత సాయి మాధవ్‌ బుర్ర మాటలను అందిస్తున్నాడు.