Begin typing your search above and press return to search.

రాజ‌మౌళి అండ్ కో అక్క‌డ దిగిపోయింది

By:  Tupaki Desk   |   31 May 2016 4:24 AM GMT
రాజ‌మౌళి అండ్ కో అక్క‌డ దిగిపోయింది
X
ఇక్క‌డ ‘బాహుబ‌లిః ది కంక్లూజ‌న్’ క్లైమాక్స్ షూట్ కు సంబంధించిన స‌న్నాహాల్లో బిజీగా ఉన్న‌ట్లే క‌నిపించాడు రాజ‌మౌళి. ఈ ప్ర‌ణాళిక‌ల‌కు సంబంధించిన ఫొటోలు కూడా కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇంత‌లోనే జ‌క్క‌న్న చైనా ఎప్పుడు వెళ్లిపోయాడబ్బా అని ఆశ్చ‌ర్య‌పోయారు ఈ రోజు శోభు యార్ల‌గ‌డ్డ ట్విట్ట‌ర్లో పోస్ట్ చేసిన ఫొటో చూసి. ఆ ఫొటోలో రాజమౌళి.. శోభుల‌తో పాటు హీరో ప్ర‌భాస్‌.. విల‌న్ రానా.. రాజ‌మౌళి స‌తీమ‌ణి ర‌మ కూడా ఉన్నారు.

బాహుబ‌లి ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా తామంతా చైనీస్ మీడియాతో డిన్న‌ర్ చేశామ‌ని వెల్ల‌డించాడు శోభు. ఇక్క‌డ ట్విస్టు ఏంటంటే.. బాహుబ‌లి ప్ర‌మోష‌న్ కోసం ఈ టీం స‌భ్యులు చైనాకు వెళ్ల‌లేదు. చైనా మీడియా ప్ర‌తినిధుల్ని హైద‌రాబాద్ కు పిలిపించి..ఇలా డిన్న‌ర్ ఇచ్చారు. మొత్తం 20 మంది చైనీస్ మీడియా ప‌ర్స‌న్స్ ఈ డిన్న‌ర్లో పాల్గొన్నారు.ఈ త‌ర‌హా ప్ర‌మోష‌న్ ఇండియాలో ఇదే తొలిసారేమో.

ఈ డిన్న‌ర్ సంద‌ర్భంగా చైనీస్ మీడియా ప్ర‌తినిధులు రాజ‌మౌళితో.. ప్ర‌భాస్ తో మాట్లాడ్డానికి చాలా ఆస‌క్తి చూపించారు. జూన్లో చైనా వ్యాప్తంగా దాదాపు 6 వేల థియేట‌ర్ల‌లో ‘బాహుబ‌లి’ విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనేక దేశాల్లో ప్ర‌కంప‌న‌లు రేపిన ‘బాహుబ‌లి’ ఈ మ‌ధ్యే తైవాన్ లో రిలీజై.. అద‌ర‌గొడుతోంది. చైనాలో భారీ స్థాయిలో విడుద‌ల‌వుతుండ‌టం.. ప్ర‌మోష‌న్ కూడా బాగా చేస్తుండ‌టంతో అక్క‌డ‌ వంద కోట్ల క‌లెక్ష‌న్ల‌తో రికార్డు నెల‌కొల్పిన బాలీవుడ్ మూవీ ‘పీకే’ను ఈ సినిమా దాటేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.