Begin typing your search above and press return to search.

ఆ నిర్మాత‌లు శంక‌ర్ తో సినిమా వ‌ద్ద‌నుకున్నారా?

By:  Tupaki Desk   |   1 Oct 2017 9:47 AM GMT
ఆ నిర్మాత‌లు శంక‌ర్ తో సినిమా వ‌ద్ద‌నుకున్నారా?
X
విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్‌ - విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు శంక‌ర్ ల కాంబినేష‌న్లో 20 ఏళ్ల క్రితం వ‌చ్చిన భార‌తీయుడు సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. అదే కాంబోలో ఆ చిత్రానికి సీక్వెల్ గా భార‌తీయుడు-2 చిత్రాన్ని తెలుగు - త‌మిళ‌ - హిందీ భాష‌ల్లో ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించ‌బోతున్నార‌ని అధికారికంగా ప్ర‌క‌ట‌న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. శంక‌ర్‌ - క‌మ‌ల్ ల తో క‌లిసి ప‌నిచేయ‌బోతున్నందుకు చాలా ఆనందంగా ఉంద‌ని దిల్ రాజు త‌న ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే, దిల్ రాజు కంటే ముందు ఈ అవ‌కాశం టాలీవుడ్ లో మ‌రో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ను వ‌రించింద‌ట‌. కానీ, కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ నిర్మాత‌లు శంక‌ర్ కు నో చెప్పార‌ని టాలీవుడ్ లో వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్ తో క‌లిసి సినిమా చేసేందుకు నిర్మాత‌లు చాలా ఉత్సాహం చూపిస్తుంటారు. ఆ అవ‌కాశం కోసం చాలామంది నిర్మాత‌లు చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. భార‌తీయుడు నిర్మించిన‌ ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు ఎఎమ్ రత్నం....దాని సీక్వెల్ ను నిర్మించేందుకు శంక‌ర్ ను సంప్ర‌దించార‌ట‌. కానీ, శంక‌ర్ ఆయ‌న‌కు నో చెప్పిన‌ట్లు తెలుస్తోంది. అయితే, భార‌తీయుడు-2 కోసం శంక‌ర్ స్వ‌యంగా బాహుబ‌లి నిర్మాత‌లు శోభు యార్ల‌గ‌డ్డ‌ - ప్ర‌సాద్ దేవినేనిల‌ను సంప్ర‌దించిన‌ట్లు తెలుస్తోంది. అయితే, కొన్ని కార‌ణాల వల్ల వారు ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రానికి నో చెప్పార‌ట‌. దీంతో, దిల్ రాజు ఆ సినిమాను నిర్మించే అవ‌కాశం ద‌క్కించున్నారు. దాదాపు 180 కోట్ల భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించేందుకు శంక‌ర్‌ - దిల్ రాజు ప్లాన్ చేస్తున్నార‌ట‌. ప్ర‌స్తుత శంక‌ర్‌ ‘2.0’ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనుల్లో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం విడుద‌ల‌య్యాక భార‌తీయుడు-2 ను తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ని తెలుస్తోంది.