Begin typing your search above and press return to search.

బాహుబ‌లి నిర్మాత‌ల షాకింగ్ కాన్సెప్ట్!

By:  Tupaki Desk   |   15 Dec 2019 4:39 PM GMT
బాహుబ‌లి నిర్మాత‌ల షాకింగ్ కాన్సెప్ట్!
X
`కేరాఫ్ కంచ‌ర‌పాలెం` చిత్రంతో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ అందుకోవ‌డ‌మే గాక విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నాడు న‌వ‌త‌రం ద‌ర్శ‌కుడు వెంక‌ట్ మ‌హా. డిఫ‌రెంట్ స్క్రీన్ ప్లేతో క‌ల్ట్ జోన‌ర్ లో సినిమా తీసి మెప్పించిన సాహ‌సి అన్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఈ సినిమా కోసం ఒక ఆటోను బుక్ చేసుకుని వైజాగ్ వీధుల్లో షూటింగులు చేశారంటే ఆర్థికంగా ఎంత స్ట్ర‌గుల్ అయ్యారో అర్థం చేసుకోవ‌చ్చు.

మొద‌టి సినిమా త‌ర్వాత వెంక‌ట్ మ‌హా విదేశాల్లో ఫిలింస్ట‌డీ స‌న్నాహ‌కాల్లో ఉన్నాడ‌ని అప్పట్లో వార్త‌లొచ్చాయి. కార‌ణం ఏదైనా చాలా గ్యాప్ త‌ర్వాత అత‌డు ఓ సినిమా చేస్తున్నాడ‌ని స‌మాచారం. ఈసారి కాన్సెప్ట్ బేస్డ్ సినిమా.. పైగా క‌మ‌ర్షియ‌ల్ సినిమా తీస్తున్నాడు. అది కూడా బాహుబ‌లి ఫ్రాంఛైజీ నిర్మాత‌లు.... ఆర్కా మీడియా అధినేత శోభు యార్ల‌గ‌డ్డ స‌మ‌ర్ప‌ణ‌లో మ‌హాయాన మోష‌న్ పిక్చ‌ర్స్ సంస్థ‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

స‌త్య‌దేవ్ క‌థానాయ‌కుడుగా న‌టిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం ప్యాచ్ వ‌ర్క్ న‌డుస్తోంది. నిర్మాణానంత‌ర ప‌నుల్ని పూర్తి చేస్తున్నారు. ఈ సినిమా వెంక‌ట్ మ‌హా కెరీర్ కి చాలా ఇంపార్టెంట్. బాహుబ‌లి నిర్మాత‌ల సినిమాగా ఏ మేర‌కు రీచ్ అవుతుందో వేచి చూడాలి. ఇక‌పై బాహుబ‌లి నిర్మాత‌ల నుంచి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల్ని ఆశించ‌వ‌చ్చ‌ని తాజా ప్ర‌య‌త్నం చెబుతోంది.