Begin typing your search above and press return to search.

సముద్ర తీరంలో ఈ జంట స్టెప్పులు అదరహో!

By:  Tupaki Desk   |   8 Oct 2016 1:46 PM GMT
సముద్ర తీరంలో ఈ జంట స్టెప్పులు అదరహో!
X
అసలే సముద్ర తీరం, పైగా బాలీవుడ్ జంట... సరదాగా రెండు స్టెప్పులు వేయాలనిపించిందో లేక తారాస్థాయికి చేరిన సంభరాల్లో భాగమో కానీ, వీరు వేసిన స్టెప్పులు మాత్రం వైరల్ గా మారాయి. తాజాగా సముద్ర తీరంలో సరదాగా స్టెప్పులు వేస్తూ తీసిన ఈ వీడియో ఇప్పుడు ఇన్‌ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వెంటనే వైరల్‌ అయిపోయింది. ఎంతలా అంటే... పోస్ట్ చేసిన అతితక్కువ సమయంలోనే ఈ వీడియోను లక్షకుపైగా జనాలు చూసెంతగా. ఇంతకూ ఈ వీడియోలో ఉన్నది ఎవరంటారా?... బాలీవుడ్‌ హీరో ఆయుష్మాన్‌ ఖురానా, సొట్టబుగ్గల సుందరి పరిణీతి చోప్రా.

ఆయుష్మాన్, పరిణీతి లు సముద్ర తీరంలో సరదాగా స్టెప్పులు వేశారు. "గజబ్‌ కా హై దిన్‌" అనే మోస్ట్ బ్యూటీఫుల్‌ సాంగ్ కు ఎలాంటి రిహార్సల్‌ లేకుండా సహజంగా డ్యాన్స్‌ చేశారు వీరిద్దరూ. అసలే సముద్రం ఒడ్డు పైగా అనుకోకుండా అద్భుతంగా కలిసిన స్టెప్పులు ఈ వీడియోకు సహజ అందాన్ని తెచ్చిపెట్టాయి. ఈ వీడియో చూసిన వారు... టేక్ లు కట్ లూ లేకుండా దీన్నే సినిమాకోసం రికార్డ్‌ చేస్తే సరిపోతుంది కదా అనే కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ఆయుష్మాన్‌ తన ఇన్‌ స్టాగ్రామ్‌ పేజీలో పోస్టు చేశాడు.

అయితే, ఈ "గజబ్‌ కా హై దిన్‌" పాటకు "కయామత్‌ కయామత్‌ తక్‌" సినిమాలో ఆమీర్‌ ఖాన్‌, జుహీ చావ్లా జోడీ సూపర్ గా నర్తించగా... ఇప్పుడు వారిని మరిపించేలా, వారికి ఏమాత్రం తగ్గకుండా ఆయుష్మాన్‌ - పరిణీతి స్టెప్పులు వేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ని ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఆయుష్మాన్‌, పరిణీతి జోడీగా "మేరీ ప్యారీ బిందు" సినిమాలో నటిస్తున్నారు. హర్రర్‌ నవలా రచయితగా ఆయుష్మాన్‌ నటిస్తున్న ఈ సినిమా 2017 లో విడుదల కానుంది. ఈ సినిమాని యష్‌ రాజ్‌ ఫిలిం సంస్థ నిర్మిస్తోంది.