Begin typing your search above and press return to search.

అవికాగోర్‌ కు హేబా ప‌టేల్ షాక్‌

By:  Tupaki Desk   |   3 Dec 2015 1:30 PM GMT
అవికాగోర్‌ కు హేబా ప‌టేల్ షాక్‌
X
ఇప్పుడు ఎవ‌రిని క‌ద‌లించినా కుమారి మాటే. అంద‌రి నోట కుమారి.. కుమారి.. యూత్ అయితే ఆమె మంత్ర‌మే జ‌పిస్తున్నారు. మ‌రి అంత‌లా త‌న అంద‌చందాల‌తో మైమ‌ర‌పించేలా చేసేసింది ఈ కుమారి హేబా ప‌టేల్‌. విభిన్న చిత్రాల ద‌ర్శ‌కుడు సుకుమార్ నిర్మాత‌గా మారి తీసిన చిత్రం `కుమారి 21 ఎఫ్‌`. రిలీజ్‌ కు ముందు నుంచే కుమారి 21 ఎఫ్ మంచి యూత్‌ ఫుల్ సినిమా అని తెలిసిపోయింది. టీజ‌ర్‌లోనూ, సినిమాలోనూ అడల్ట్ కంటెంట్ ఉందంటూ జోరుగా ప్ర‌చారం సాగింది.

తొలి షోకే హిట్ టాక్ రావ‌డంతో యూత్ సినిమాని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇందులో హీరోయిన్‌ తో పాటు హీరో రాజ్‌ త‌రుణ్ న‌ట‌న కూడా సినిమాకి హైలైట్‌ గా నిలిచింది. ఇప్పుడు ఈ జంట హిట్ పెయిర్ అయిపోయింది. అందుకే ఈ జంట‌నే మ‌ళ్లీ రిపీట్ చేసేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు సిద్ధ‌మైపోతున్నారు. ఇద్దరి మ‌ధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో ఈ కాంబినేషన్ కు క్రేజ్ ఏర్పడింది .

కామెడీ చిత్రాల దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మించనున్న చిత్రంలో మొదట రాజ్ తరుణ్ సరసన అవికా గోర్ ని ఎంపిక చేయాలనుకున్నారు.. కానీ `కుమారి`లో హేబా అందాలకు ఫిదా అయిన దర్శక నిర్మాతలు చివ‌ర‌కు ఆమెనే ఫిక్స్ చేశారట! ఇక ఈ చిత్రంలో మంచు విష్ణు కూడా నటించనున్నాడు . పంజాబీ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం తో మరో హిట్ కొట్టాలని భావిస్తున్నారు కుమారి 21 ఎఫ్‌ జంట.