Begin typing your search above and press return to search.

ప్రభాస్‌ మూవీ కోసం అవెంజర్స్‌ టీం

By:  Tupaki Desk   |   19 Jun 2020 6:53 AM GMT
ప్రభాస్‌ మూవీ కోసం అవెంజర్స్‌ టీం
X
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్‌ పూర్తి అయిన వెంటనే మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వచ్చింది. ఈ సినిమాను కేవలం ఇండియాలోనే కాకుండా ఇంగ్లీష్‌ లో డబ్‌ చేసి ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా  ఇప్పటికే పేర్కొన్నారు.

నాగ్‌ అశ్విన్‌ ఇప్పటికే ఈ సినిమా కోసం హాలీవుడ్‌ సినిమాటోగ్రాఫర్‌ ను ఎంపిక చేయడం జరిగింది. ఇంకా ఈ చిత్రం కోసం అవెంజర్స్‌ కోసం పని చేసిన కొందరు టెక్నీషియన్స్‌ తో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. విజుల్‌ ఎఫెక్ట్స్‌ తో పాటు ఇంకా చిత్రానికి సంబంధించిన సౌండ్‌ ఎఫెక్ట్స్‌ ను కూడా హాలీవుడ్‌ రేంజ్‌ లోనే నాగ్‌ అశ్విన్‌ ప్లాన్‌ చేస్తున్నాడట.

ప్రభాస్‌ కు బాహుబలి చిత్రంతో పాన్‌ ఇండియా క్రేజ్‌ వచ్చింది. ఇప్పటికే ఆయన తదుపరి చిత్రాల పై బాలీవుడ్‌ లో కూడా విపరీతమైన క్రేజ్‌ ఉంది. అలాంటిది ఈసారి ఏకంగా పాన్‌ ఇండియా మూవీతో వరల్డ్‌ నే ప్రభాస్‌ టార్గెట్‌ చేయాలి అంటే ఈమాత్రం హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ ను ఈ చిత్రం కోసం పని చేయించాల్సిందే అంటున్నారు. ఈ ఏడాది చివర్లో ప్రారంభించి 2022 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.