Begin typing your search above and press return to search.

సిద్ శ్రీరామ్ పాడిన మరో బ్యూటిఫుల్ మెలోడీ 'బాగుంటుంది నువ్వు నవ్వితే'..!

By:  Tupaki Desk   |   27 Sep 2021 7:12 AM GMT
సిద్ శ్రీరామ్ పాడిన మరో బ్యూటిఫుల్ మెలోడీ బాగుంటుంది నువ్వు నవ్వితే..!
X
యువ హీరో ఆది సాయి కుమార్ - నువేక్ష జంటగా నటిస్తున్న తాజా చిత్రం ''అతిధి దేవోభవ''. లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన టైటిల్ - ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా సినిమాలోని 'బాగుంటుంది నువ్వు నవ్వితే' అనే బ్యూటిఫుల్ మెలోడీ గీతాన్ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

'బాగుంటుంది నువ్వు నవ్వితే.. బాగుంటుంది ఊసులాడితే.. బాగుంటుంది గుండె మీద గువ్వలాగా నువ్వు వాలితే..' అంటూ సాగిన ఈ పాట శ్రోతలను విశేషంగా అలరిస్తోంది. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర దీనికి స్వరాలు సమకూర్చగా.. గేయ రచయిత భాస్కర భట్ల సాహిత్యం అందించారు. గాయకులు సిద్ శ్రీరామ్ మరియు నూతన మోహన్ కలిసి ఈ గీతాన్ని ఆలపించారు. ఇప్పటికే ఆది సినిమా కోసం 'ఒకే ఒక లోకం నువ్వు' అనే చార్ట్ బస్టర్ సాంగ్ పాడిన సిద్.. మరోసారి తన వాయిస్ తో మ్యాజిక్ క్రియేట్ చేశారు. ఈ సాంగ్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తుందనడంలో సందేహం లేదు.

'బాగుంటుంది నువ్వు నవ్వితే పాట ప్రేమలో ఉన్న హీరోహీరోయిన్లు వారిలో నచ్చిన అంశాలను వర్ణించుకునే నేపథ్యంలో రూపొందింది. ఇందులో ఆది సాయి కుమార్ - నువేక్ష మధ్య కెమిస్ట్రీ.. విజువల్స్ బాగున్నాయి. అమరనాధ్ బొమ్మిరెడ్డి దీనికి సినిమాటోగ్రఫీ అందించగా.. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ వర్క్ చేశారు. ఈ చిత్రానికి వేణు గోపాల్ రెడ్డి కథ అందించగా.. రజనీ రాజబాబు స్క్రీన్ ప్లే - మాటలు రాశారు.

రామ సత్యనారాయణ రెడ్డి సమర్పణలో శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్ పై రాజబాబు మిర్యాల మరియు అశోక్ రెడ్డి మిర్యాల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'అతిథి దేవోభవ' చిత్రంలో రోహిణి - సప్తగిరి - సూర్య - ఆదర్శ్ - రవి ప్రకాష్ - రఘు కారుమంచు - మణిచందన - భెల్ ప్రసాద్ - గుండు సుదర్శన్ - ప్రియాంక - నవీనా రెడ్డి - సత్తిపండు - ఇమ్మాన్యుయేల్ తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.