Begin typing your search above and press return to search.

చిరుతో అశ్వినీ దత్.. సెన్సేషనల్ కాంబో

By:  Tupaki Desk   |   16 Oct 2016 9:30 AM GMT
చిరుతో అశ్వినీ దత్.. సెన్సేషనల్ కాంబో
X
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీ దత్ టాలీవుడ్ లో ఎన్నో ప్రతిష్టాత్మకమైన చిత్రాలు చేశారు. మెగాస్టార్ చిరంజీవితో చేసిన సినిమాలతో అయితే చరిత్ర సృష్టించేసిన హిస్టరీ కూడా ఉంది. జగదేక వీరుడు అతిలోక సుందరి.. చూడాలని ఉంది.. ఇంద్ర లు ఇండస్ట్రీ హిట్స్ గా నిలవగా.. జై చిరంజీవ యావరేజ్ గా నిలిచింది. అయితే.. గత కొన్నేళ్లుగా ఈయన టైమ్ బాగాలేదు. ముఖ్యంగా కంత్రీ.. శక్తిల డిజాస్టర్ల తర్వాత కోలుకోవడానికి చాలాకాలమే పట్టింది.

ఇప్పుడు మళ్లీ వైజయంతి ప్రతిష్టను నిలబెట్టే సినిమాతో రీఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట అశ్వినీ దత్. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో మాటామంతీ నడుపుతున్నారని.. చిరంజీవి 151వ సినిమాని తానే నిర్మిస్తానని అంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి దర్శకుడుగా బోయపాటి శ్రీనునే ఉంటాడని ఇండస్ట్రీ జనాలు అనుకుంటూ ఉండగా.. అదే దర్శకుడితో సినిమాకే అశ్వినీ దత్ కూడా మొగ్గుతున్నారు.

కానీ.. చిరు 151ని అల్లు అరవింద్ తో గీతాఆర్ట్స్ కి చేస్తారని ఇప్పటికే టాక్ ఉంది. అటు చిరంజీవితోను.. ఇటు అల్లు అరవింద్ తోను మంచి సాన్నిహిత్యం ఉండడంతో మెగా 151ను.. వీరిద్దరూ కలిసి నిర్మించే ఛాన్సెస్ ఉన్నాయట.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/