Begin typing your search above and press return to search.

కొడుకు కోసం 'వకీల్ సాబ్' అడ్వాంటేజ్ గా బడా ప్రొడ్యూసర్..!

By:  Tupaki Desk   |   10 April 2021 5:42 AM GMT
కొడుకు కోసం వకీల్ సాబ్ అడ్వాంటేజ్ గా బడా ప్రొడ్యూసర్..!
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు చాలామందే ఉన్నారు. కానీ ఆ హీరోలలో ఎక్కువగా వారసులు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. చిత్రపరిశ్రమకు చెందిన బడా దర్శకులు, ప్రొడ్యూసర్స్, హీరోస్ ఇలా వీరి వారసులే ఎక్కువ. ముఖ్యంగా ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఫ్యామిలీస్ నుండి వచ్చే హీరోలకు కొదవేలేదు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వెలుగుతున్న వారంతా దాదాపు వారసులుగా ఎంట్రీ సాగుతున్నవారే. అయితే ఎంతటి బడా ఫ్యామిలీ నుండి వచ్చినా ఇండస్ట్రీలో కొనసాగాలంటే మాత్రం హిట్స్ తప్పనిసరి. అలాగే నటనలో కూడా ఎవరికి వారు నిరూపించుకోవాల్సిందే. ఎలాంటి బాక్గ్రౌండ్ నుండి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతే వారు చక్కగా ఇంటికి పంపిస్తారు లేదా పక్కన పెట్టేస్తారు. ఈ విషయం పక్కనపెడితే.. త్వరలో టాలీవుడ్ ఇండస్ట్రీకి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఫ్యామిలీ నుండి ఓ హీరో వస్తున్న సంగతి తెలిసిందే.

దిల్ రాజుతో పాటు సినిమాలకు సహనిర్మాతగా వ్యవహరించే శిరీష్ రెడ్డి కొడుకు ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయం అవుతున్నాడు. రౌడీబాయ్స్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఆశిష్ రెడ్డిని హుషారు ఫేమ్ డైరెక్టర్ శ్రీహర్ష హీరోగా పరిచయం చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తుండగా మిర్చి, సాహో ఫేమ్ సినిమాటోగ్రాఫర్ మది ఛాయాగ్రాహకుడిగా వర్క్ చేస్తుండటం విశేషం. అయితే ఫస్ట్ సినిమానే బడా టెక్నీషియన్స్ తో ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు దిల్ రాజు. ఆశిష్ రెడ్డి సరసన కుర్రభామ అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. తాజాగా రౌడీబాయ్స్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం వకీల్ సాబ్ హవా నడుస్తుండగా.. ఆ సినిమా గ్యాప్ లో రౌడీబాయ్స్ మోషన్ పోస్టర్ వేస్తున్నారట. అంటే ప్రేక్షకులకు ఎలాగో తమ వారసుడి మొహం తెలియదు కాబట్టి ఈ విధంగా దిల్ రాజు అడ్వాంటేజ్ తీసుకొని ఆశిష్ ను పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాడని టాక్. కొడుకు విషయంలో వకీల్ సాబ్ ను బాగానే వాడుకుంటున్నాడని సినీవర్గాలలో చర్చలు నడుస్తున్నాయి. కేవలం దేవిశ్రీ, అనుపమల పేర్లు చూసి ఆడియన్స్ చూస్తున్నారట. జూన్ 25న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.