Begin typing your search above and press return to search.

'లైగర్' ని హైదరాబాద్ లోనే సెట్ చేస్తున్నారా..?

By:  Tupaki Desk   |   11 Jun 2021 11:30 PM GMT
లైగర్ ని హైదరాబాద్ లోనే సెట్ చేస్తున్నారా..?
X
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ''లైగర్''. 'సాలా క్రాస్ బ్రీడ్' అనేది దీనికి ట్యాగ్ లైన్. మిక్డ్స్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ని పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ముంబైలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో లాంగ్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేశారు. కరోనా తగ్గుముఖం పట్టి, పరిస్థితులు చక్కబడితే, తదుపరి షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్‌ లో ప్రారంభించాలని చూస్తున్నారని తెలుస్తోంది.

నిజానికి 'లైగర్' నెక్స్ట్ షెడ్యూల్ ని విదేశాలలో ప్లాన్ చేసారట. అయితే ఇప్పుడు కోవిడ్ టైంలో విదేశాలకు వెళ్లడం కంటే భాగ్యనగరంలో చేయడం మంచిదనే నిర్ణయానికి వచ్చారట. దీని కోసం హైదరాబాద్ లో ప్రత్యేకంగా సెట్‌ వేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఫారిన్ లో ప్లాన్‌ చేసిన షూట్ అంతా హైదరాబాద్‌ లో వేసిన సెట్‌ లో చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోందట. ఈ నేపథ్యంలో ప్రముఖ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండీ లాంగ్ తో పాటు కొంతమంది విదేశీ బాక్సర్స్ ఇక్కడికి రానున్నారట. ఇప్పటికే ఆండీ తన బృందంతో కలిసి స్పెషల్ యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా, 'లైగర్' చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా.. విలక్షణ నటి రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తోంది. రోనీత్ రాయ్ - ఆలీ - విషు రెడ్డి - మకరంద్ దేశ్ పాండే - గెటప్ శీను తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. జునైద్ సిద్దిఖీ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. పూరీ కనెక్ట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరీ జగన్నాథ్ - ఛార్మీ కౌర్ - కరణ్ జోహార్ కలిసి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.