Begin typing your search above and press return to search.

ఎప్పుడో కంప్లీటైన సినిమాని మళ్ళీ షూట్ చేస్తున్నారా..?

By:  Tupaki Desk   |   1 Dec 2022 2:30 AM GMT
ఎప్పుడో కంప్లీటైన సినిమాని మళ్ళీ షూట్ చేస్తున్నారా..?
X
'కార్తికేయ 2' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత నిఖిల్ సిద్ధార్థ మరియు అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ''18 పేజెస్''. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని క్రిస్మస్ స్పెషల్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ 23న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్లు డేట్ కూడా అనౌన్స్ చేసారు. అయితే ఈ సినిమా ఇంకా షూటింగ్ జరుపుకుంటుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

'18 పేజెస్' మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. సినిమాని పూర్తి చేయడానికి టీం అంతా నిర్విరామంగా డే అండ్ నైట్ తీవ్రంగా కష్టపడుతున్నారు. సెట్స్ లో రాత్రి సమయంలో చిత్రీకరణకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది.

నిజానికి రెండేళ్ల క్రితమే మొదలైన '18 పేజెస్' చిత్రం.. షూటింగ్ పూర్తి చేసుకొని ఇప్పటికే విడుదల కావాల్సింది. ఈ ఏడాది సమ్మర్ లో విడుదల అని ప్రకటించి.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చేసారు. చివరి నిమిషంలో ఈ సినిమాని వాయిదా వేశారు. అయితే ఎప్పుడో అయిపోయిన సినిమాకి ఇప్పుడు మళ్ళీ షూటింగ్ చేస్తున్నారు. దీనికి కారణం 'కార్తికేయ 2' చిత్రంతో పాన్ ఇండియా క్రేజ్ రావడమే అని తెలుస్తోంది.

'కార్తికేయ 2' సినిమా బాక్సాఫీస్ వద్ద 130 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా హిందీలో ఈ సినిమా అనూహ్య వసూళ్లు సాధించింది. దీంతో నిఖిల్ మరియు అనుపమ కాంబినేషన్ లో రాబోతున్న ''18 పేజెస్'' చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో బెటర్ అవుట్ ఫుట్ కోసం టీం అంతా కష్టపడుతోందని తెలుస్తోంది. కొన్ని సీన్స్ ని రీషూట్ చేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది.

'18 పేజెస్' చిత్రానికి 'పుష్ప' మేకర్ సుకుమార్ స్టోరీ అందించడం కూడా అందరిలో ఆసక్తిని రెట్టింపు చేసింది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ సినిమాని సమర్పిస్తున్నారు. జీఏ2 పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లపై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కి గోపీ సుందర్ సంగీతం సమకూర్చారు. తమిళ్ హీరో శింబు ఈ సినిమాలో ఒక పాట పాడటం విశేషం. శ్రీకాంత్ విస్సా సంభాషణలు రాయగా.. ఎ వసంత్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. రమణ వంక ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయగా.. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే '18 పేజెస్' సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 'నన్నయ రాసిన' పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. 'టైం ఇవ్వు పిల్లా' అంటూ శింబు పాడిన సాంగ్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 'కార్తికేయ 2' తర్వాత నిఖిల్ నుంచి రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.