Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ త‌ప్పు చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   9 Dec 2022 6:18 AM GMT
ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ త‌ప్పు చేస్తున్నారా?
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల టార్గెట్ దారి త‌ప్పుతోందా?.. అన‌వ‌స‌రంగా డైరెక్ట‌ర్ హ‌రాష్ శంక‌ర్ ని టార్గెట్ చేస్తూ త‌ప్పు చేస్తున్నారా? అంటే జ‌రుగుతున్న ప‌రిణామాలు నెట్టింట ప‌వ‌న్ ఫ్యాన్స్ మొద‌లు పెట్టిన ట్రోల్స్ చూస్తుంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. మూడు రోజుల క్రితం 'సాహో' ఫేమ్ సుజీత్ డైరెక్ష‌న్ లో డీవీవీ దాన‌య్య ఓ భారీ పాన్ ఇండియా మూవీని ప‌వ‌న్ క‌ల్యాణ్ తో నిర్మిస్తున్న‌ట్టుగా ఓ కాన్సెప్ట్ పోస్ట‌ర్ తో వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.

అయితే ఈ ప్ర‌క‌ట‌న వ‌చ్చిన వెంట‌నే స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ 'పెద్ద ఉత్సాహం రాబోతోంది..వాచౌట్ దిల్ స్పేస్ గైస్‌' అంటూ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్వీట్ చేయ‌డం స‌రికొత్త ర‌చ్చ‌కు తెర లేపింది.

సుజీత్ తో ప‌వ‌న్ చేయ‌బోతున్న స్టోరీ స్ట్రెయిట్ మూవీ అని తేల‌డం.. 'తేరీ' రీమేక్ బాధ్య‌త‌ల్ని హ‌రీష్ శంక‌ర్ కు ప‌వ‌న్ అప్ప‌గించాడ‌ని వార్త‌లు వైర‌ల్ కావ‌డంతో ప‌వ‌న్ అభిమానులు నెట్టింట ర‌చ్చ చేయ‌డం మొద‌లు పెట్టారు. #WeDontWantTheriRemake అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తూ తేరీ రీమేక్ ని ఎట్ట‌ప‌రిస్థితుల్లోనూ చేయ‌కూడద‌ని మండిప‌డుతున్నారు.

హ‌రీష్ శంక‌ర్ తాను 'తేరీ' రీమేక్ చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించ‌క‌పోయినా త‌న నుంచి అదే రీమేక్ రాబోతోంద‌ని ప‌వ‌న్ ఫ్యాన్స్ కి క్లారిటీ రావ‌డంతో నెట్టింట హ‌రీష్ శంక‌ర్ ని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఓ అభిమాని అయితే మ‌రింత‌గా భ‌య‌పెడుతోంది. 'తేరీ' రీమేక్ క‌న‌క ఆప‌క‌పోతే నా చావుని చూడాల్సి వ‌స్తుంద‌ని హ‌రీష్ శంక‌ర్ పై ఫైర్ అవుతున్న తీరు కంగారు పెట్టిస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌తీ ఆదివారం టీవీల్లో ప్ర‌సారం అవుతున్న 'పోలీసోడు' మూవీని మ‌ళ్లీ ప‌వ‌న్ తో రీమేక్ చేస్తూ ఓ యువ‌తి సూసైడ్ పోట్ రాయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

ఇంత వ‌ర‌కు ఎన్నో రీమేక్ లు చేసినా ఇంత‌లా ఫీల‌వ్వ‌లేద‌ని, తేరీ రీమేక్ చేస్తున్నార‌ని తెలిసింది. నా చావుని చూసైనా తేరీ రీమేక్ ని ఆపండి' అంటూ ఏకంగా ఓ యువ‌తి సూసైడ్ నోట్ రాయ‌డం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. అయితే ఈ ఎంటైర్ ఎపిసోడ్ ని, హారీష్ శంక‌ర్ ని ట్రోల్ చేస్తున్న విధానాన్ని గ‌మ‌నించిన ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు మాత్రం ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు ఇప్ప‌టికైనా రియ‌లైజ్ కావాల‌ని, హ‌రీష్ శంక‌ర్ ని త‌ప్పుప‌ట్ట‌డంలో అర్థం లేద‌ని, హీరో ప‌వ‌న్ చేయ‌మంటే చేస్తాడు. ఆపేయ‌మంటే ఆపేస్తాడు. నిర్ణ‌యం ప‌వ‌న్ చేతుల్లో వుంద‌ని, ఈ చిన్న లాజిక్ ప‌వ‌న్ ఫ్యాన్స్ కి ఎందుకు అర్థం కావ‌డం లేద‌ని సెటైర్లు వేస్తున్నారు.

ఉన్న‌ట్టుండి ప‌వ‌న్ 'తేరీ' రీమేక్ బాధ్య‌త‌ల్ని హ‌రీష్ శంక‌ర్ కు ఇవ్వడానికి బ‌ల‌మైన కార‌ణం వుంద‌ని తెలుస్తోంది. మైత్రీ వారికి సినిమా చేస్తాన‌ని ప‌వ‌న్ డ‌బ్బులు తీసుకున్నాడు. అదే 'భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్‌'. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌కుడు. కానీ అది ఇప్ప‌ట్లో ప‌ట్టాలెక్కేలా క‌నిపించ‌డం లేదు. ఆ స్థానంలో మైత్రీ వారికి 'తేరీ'ని చేయ‌మ‌బోతున్నాడ‌ట‌. హ‌రీష్ శంక‌ర్ కూడా మైత్రీ వారి నుంచి అడ్వాన్స్ తీసుకోవ‌డంతో త‌ను కూడా ఈ రీమేక్ కు ఓకె చెప్పాడ‌ని త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ రానుంద‌ని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.