Begin typing your search above and press return to search.

చెర్రీ విలన్.. వర్కవుట్ అవలేదంటున్నారే

By:  Tupaki Desk   |   3 Feb 2017 1:30 AM GMT
చెర్రీ విలన్.. వర్కవుట్ అవలేదంటున్నారే
X
రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ధృవ. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ ఎంతగా ఆకట్టుకున్నాడో.. అంతకు మించిన స్పెషల్ అట్రాక్షన్ అరవింద్ స్వామి. ధృవకు మాతృక అయిన తనిఒరువన్ లో అరవింద్ స్వామి ఒదిగిపోయిన తీరు చూసి.. ఆ పాత్రను వేరే వాళ్లతో చేయించలేక.. ఈ సీనియర్ హీరోనే పట్టుకొచ్చారు. ఇప్పుడు తని ఒరువన్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ ఓ సినిమా రూపొందడమే కాదు రిలీజ్ అయిపోయింది కూడా.

బోగన్ అనే పేరుతో తెరకెక్కిన ఈ మూవీలో.. జయం రవి.. అరవింద్ స్వామి.. హన్సికలు నటించారు. తని ఒరువన్ మూవీ అంతా సీరియస్ టోన్ లో థ్రిల్లర్ టైపులో సాగుతుందనే విషయం తెలిసిందే. కానీ బోగన్ మాత్రం కంప్లీట్ కామెడీ జోనర్ లో రూపొందించారు. జయం రవి- అరవింద్ స్వామి అనగానే.. భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుని థియేటర్స్ కి వచ్చిన వాళ్లను.. కామెడీతో థ్రిల్ చేశారు వీరిద్దరు. అయితే.. కామెడీ బాగానే వర్కవుట్ అయినా.. బోగన్ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఇంకా చెప్పాలంటే.. చాలా ఆశించి థియేటర్లకు వచ్చిన వాళ్లను నిరాశపరిచింది.

ఇప్పటివరకూ బోగన్ రీమేక్ రైట్స్ కోసం విపరీతమైన పోటీ కనిపించింది కానీ.. డీల్ సెట్ కాలేదు. ఇప్పుడు తమిళ్ మూవీకి వచ్చిన రియాక్షన్ చూశాక.. తెలుగు రీమేక్ రావడం కష్టమే అనే టాక్ వినిపిస్తోంది.