Begin typing your search above and press return to search.

స్టయిలిష్‌ విలన్ తో సాహో పోరాటం?

By:  Tupaki Desk   |   6 May 2017 4:05 AM GMT
స్టయిలిష్‌ విలన్ తో సాహో పోరాటం?
X
బాహబలి హిట్టయిపోవడంతో ప్రభాస్ రేంజ్ మారిపోయిందనే అందరూ నమ్ముతున్నారు. కాని వాస్తవానికి ఆ సినిమా తాలూకు రెండు పార్టులూ చూస్తే మాత్రం.. అందరికంటే ఎక్కువ పేరు రాజమౌళికే వచ్చింది. మిగతా నటులందరిలో చాలా లోపాలు ఉన్నా కూడా.. రాజమౌళి తాలూకు బ్రిలియంట్ స్ర్కీన్ ప్లే వాటిని కవర్ చేసిందనేది సీరియస్ విమర్శకుల పాయింట్.

అయిన్నీ మాకు తెలియదు కాని.. బాహుబలి 2 కూడా గ్రాండ్ హిట్ అవ్వడంతో ఇప్పుడు ప్రభాస్ తదుపరి సినిమా ''సాహో''పై భారీగానే ఇన్వెస్టుమెంట్ పెట్టేస్తున్నారు. అందుకే ఇప్పుడు సినిమాలోని క్యాస్టింగ్ అంతా భారీగా కనిపించాలి కాబట్టి.. కాస్త ఖరీదైన నటులనే దించుతున్నారులే. ఆల్రెడీ హీరోయిన్ విషయంలో చాలా ఆప్షన్లు అనుకుంటూ జాప్యం చేస్తున్న సాహో టీమ్.. విలన్ విషయంలో మాత్రం ఒక పక్కా నిర్ణయానికి వచ్చేశారట. ధృవ సినిమాలో విలన్ గా నటించిన అర్వింద్ స్వామిని.. కావాలంటే కోటికి పైగా రెమ్యూనరేషన్ ఇచ్చేసి 'సాహో'తో పోరాడటానికి సెట్ చేద్దాం అని చూస్తున్నారట.

యువి క్రియేషన్స్ వారు ఈ సినిమాను రూపొందిస్తుండగా.. రన్ రాజా రన్ ఫేం సుజిత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మొన్నటివరకు రష్మిక.. ఇప్పుడు తమన్నా.. అంటూ హీరోయిన్ పై రూమర్లు వినిపిస్తున్నాయి.. ఎవర్ని ఫైనల్ చేశారో ఇంకా తెలియదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/