Begin typing your search above and press return to search.

అరవింద్ స్వామి-తమన్నా జంటగా..ఒక థ్రిల్లర్‌

By:  Tupaki Desk   |   6 Sept 2016 12:51 PM IST
అరవింద్ స్వామి-తమన్నా జంటగా..ఒక థ్రిల్లర్‌
X
అరవింద్ స్వామీ.. ఇకప్పటి మోస్ట్ రొమాంటిక్ హీరో. అప్పట్లో మగవాళ్ల అందం గురించి చెప్పాలన్నా - అమ్మాయిల కలల రాకుమారుడి గురించి ప్రస్థావించాలన్నా అరవింద్ స్వామిని ఉదాహరణగా చెప్పిన సందర్భాలు లేకపోలేదంటే అది అతిశయోక్తి కాదేమో. హీరోగా నటించిన కొన్ని సినిమాల తర్వాతి కాలంలో పెద్దగా వెండితెరపై కనిపించని అరవింద్ స్వామి.. సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం "తనీ ఒరువన్‌" సినిమాతో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నారు. ఈ క్రమంలో సక్సెస్ ఫుల్ గానే కెరీర్ ని కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా అరవింద్ స్వామి హీరోగా ఒక సినిమా ప్లాన్ జరుగుతుందని తెలుస్తుంది. ఈ సినిమా కోసం తమన్నాను కూడా కలిశారట.

అరవింద్‌ స్వామి విలన్‌ గా చేస్తున్న సినిమాలో తమన్నా హీరోయిన్‌ అంటే అది పెద్ద విషయం కాకపోవచ్చు కానీ.. ఈటైం లో వీళ్లిద్దరూ జంటగా సినిమా రాబోతుందని చెబుతుంది తమిళ మీడియా. వీళ్లిద్దరూ ప్రధాన పాత్రల్లో ఒక థ్రిల్లర్‌ సినిమా తెరకెక్కబోతోందట. వీరికోసం ఒక గ్యాంబ్లింగ్ కథ రెడీ అవుతుందని తెలుస్తుంది. ఈ విషయంలో మరో అడుగు ముందుకేసినవారు తమిళ్ లో సూపర్ హిట్ అయిన "శతురంగ వేట్టై" మూవీకి ఇది సీక్వెల్‌ అని కూడా అంటున్నారు. ఇదే నిజమైతే ఒక సూపర్ హిట్ సినిమా సీక్వెల్ తో ఈ జంట ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే చెప్పాలి.

కాగా శతురంగ వేట్టై అనేది తమిళంలో గత కొన్నేళ్లలో వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో ఒకటనే చెప్పవచ్చు. త్రివిక్రమ్‌ రీసెంట్ మీవీ "అఆ" తో టాలీవుడ్‌ కు పరిచయమైన సినిమాటోగ్రాఫర్‌ నటరాజన్‌ సుబ్రమణ్యం హీరోగా నటించిన సినిమా ఇది. రైస్ పుల్లింగ్ పేరుతో గ్యాంబ్లింగ్ చేస్తూ జీవనం సాగించే వ్యక్తి కథ ఇది. ఇప్పుడు అరవింద్‌ స్వామి - తమన్నా కాంబినేషన్లో ఆ సూపర్‌ హిట్‌ మూవీకి సీక్వెల్‌ తీయాలనుకుంటున్నాడట ఆ చిత్ర దర్శకుడు వినోద్.