Begin typing your search above and press return to search.

#టెట్ పాస్.. బీహార్ లో టీచ‌ర్ గా చేరుతున్న అనుప‌మ‌?

By:  Tupaki Desk   |   25 Jun 2021 7:31 AM GMT
#టెట్ పాస్.. బీహార్ లో టీచ‌ర్ గా చేరుతున్న అనుప‌మ‌?
X
మ‌ల‌యాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ బీహార్ లో జరిగిన రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (STET) లో ఉత్తీర్ణత సాధించినట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లో ప్ర‌భుత్వ టీచ‌ర్ గా చేరి పాఠాలు భోధించ‌డ‌మే ఇక ఆల‌స్యం!! అవునా .. ఇది నిజ‌మా..? ఇంత‌లోనే ఎలా సాధ్యం! అంటూ షాక్ తిన‌డం అభిమానుల వంతైంది. ఏపీ - తెలంగాణ‌లో అస‌లే టెట్- డీఎస్సీ ప‌రీక్ష‌లు రాసి టీచ‌ర్ ఉద్యోగం కోసం ఆత్రంగా ఉన్న‌వారికి ఇది తెలిసి మ‌రీ షాక్ తింటున్నారు. ఇంత సింపుల్ గా అనుప‌మ‌కు టీచ‌ర్ జాబ్ ఎలా వ‌చ్చిందబ్బా? అంటూ మెరిట్ అభ్య‌ర్థులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

నిజానికి అనుప‌మ రాంగ్ ఫోటో ఇంత‌టి క‌న్ఫ్యూజ‌న్ కి దారి తీసింది. ఈ పరీక్షలకు రిషికేశ్ కుమార్ అనే అభ్యర్థి హాజరయ్యారు. అతను దానిని క్లియర్ చేసిన తరువాత త‌న ఫోటో లేక‌పోవ‌డంతో..ఏం జ‌రిగిందో తెలుసుకోవడానికి వెబ్ సైట్ లో ఫలితాల‌ షీట్ తనిఖీ చేశాడు. అక్క‌డ‌ త‌న ఫోటో బదులుగా `ప్రేమం` బ్యూటీ అనుప‌మ ఫోటో ద‌ర్శ‌న‌మిచ్చింది.

అనుప‌మ‌ అడ్మిట్ కార్డు ఇప్పుడు అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో వైరల్ అయ్యింది. దీనిని ఆర్జేడీ సభ్యులు.. ముఖ్యంగా తేజస్వి యాదవ్.. రీతూ జైస్వాల్ షేర్ చేయ‌డంతో ప్ర‌జ‌ల్లో హాట్ టాపిక్ గా మారింది. వైరల్ గా మారిన ఈ క్లిప్ విద్యార్థి పేరు నుండి పుట్టిన తేదీ వరకు ప్ర‌తిదీ సరైన ఆధారాలతోనే క‌నిపిస్తోంది. అయితే క్రిందికి స్క్రోల్ చేసినప్పుడు రిషికేశ్ కుమార్ ఫోటోకు బదులుగా అనుప‌మ‌ ఫోటో ఊహించని విధంగా క‌నిపిస్తోంది. ఇది ఫైన‌ల్ ఫలితాల‌ షీట్లో కూడా కనిపిస్తోంది.

అయితే ఈ వ్య‌వ‌హారంపై కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. తప్పును సరిదిద్దడానికి నేను సంబంధిత‌ విభాగాన్ని సంప్రదించాను. కానీ నా అభ్యర్థనను ఎవరూ పట్టించుకోలేదు అని అన్నారు. పేపర్- 1 మ్యాథ్స్ లో 150 కి 77 మార్కుల‌తో.. పేపర్ 2 లో ఇదే సబ్జెక్టులో 150 కి 95 మార్కుల‌ను సాధించాడు. ఇదొక్క‌టే అరుదైన సంఘటన కాదు. అంతకుముందు.. ఎమ్రాన్ హష్మి .. సన్నీ లియోన్ కూడా ఒకే పరీక్ష కోసం అనేక అడ్మిట్ కార్డులలో కనిపించారు. తెలుగు రాష్ట్రాల ప‌రీక్ష‌ల్లోనూ సెల‌బ్రిటీల ఫోటోలు ప్ర‌త్య‌క్ష‌మైన సందర్భాలున్నాయి.