Begin typing your search above and press return to search.

సలార్ లో ఛాన్స్ కొట్టేసిన 'ఖిలాడీ' బ్యూటీ

By:  Tupaki Desk   |   4 Oct 2021 10:30 AM GMT
సలార్ లో ఛాన్స్ కొట్టేసిన ఖిలాడీ బ్యూటీ
X
రవితేజ హీరోగా రూపొందుతున్న ఖిలాడీ సినిమాలో మీనాక్షి చౌదరి నటిస్తున్న విషయం తెల్సిందే. ఈమద్య కాలంలో తెలుగు లో ఈమె గురించిన చర్చలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. చిన్నా చితకా సినిమాల నుండి మొదలుకుని మీడియం రేంజ్ సినిమాల వరకు వరుసగా సినిమాలు చేస్తున్న ముద్దుగుమ్మకు భారీ ఆఫర్‌ దక్కినట్లుగా సమాచారం అందుతోంది. సౌత్ తో పాటు నార్త్‌ లో కూడా ఎంతో మంది అంచనాలు పెంచుకుని ఎదురు చూస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ప్రభాస్ సలార్‌ లో ఈమెకు అవకాశం వచ్చిందనే వార్తలు వస్తున్నాయి. సలార్‌ సినిమా లో మెయిన్ హీరోయిన్ గా శృతి హాసన్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో మరో హీరోయిన్‌ పాత్రకు స్కోప్‌ ఉందట. గెస్ట్‌ కు ఎక్కువ హీరోయిన్ కు తక్కువ ఉండే ఆ పాత్రను మీనాక్షి చౌదరితో చేయించబోతున్నారట.

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్‌ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిపారు. భారీ హై ఓల్టేజ్‌ యాక్షన్‌ సన్నివేశాలు ఈ సినిమాలో ఉంటాయని మేకర్స్ బలంగా చెబుతున్నారు. రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లు సాధించిన కేజీఎఫ్‌ ను తెరకెక్కించి అంతకు మించిన భారీ సినిమా కేజీఎఫ్‌ 2 ను తెరకెక్కించి విడుదలకు సిద్దం చేసిన ప్రశాంత్‌ నీల్‌ ఇప్పుడు సలార్ సినిమాను చేస్తున్న నేపథ్యంలో పాన్ ఇండియా రేంజ్ లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా సినిమాను భారీ ఎత్తున తెరకెక్కించడం కోసం ప్రతి చిన్న పాత్ర విషయంలో కూడా చాలా జాగ్రత్తలను ప్రశాంత్‌ నీల్ తీసుకుంటున్నాడట. అందుకే స్టార్‌ కాస్టింగ్‌ విషయంలో సలార్ సినిమా స్థాయి పెరుగూతనే ఉంది. కేజీఎఫ్ తో పోల్చితే సలార్ పది రెట్ల భారీ సినిమా అంటూ యూనిట్‌ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. అందుకే ఈ సినిమా లో చిన్న పాత్ర చేసినా కూడా కెరీర్ లో గుర్తుండి పోయేది అవుతుందని అంటున్నారు.

శృతి హాసన్‌ మరియు ప్రభాస్ జోడీ లో ఇప్పటికే కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఇద్దరి పెయిర్ కు మంచి మార్కులు పడుతున్నాయి. ఇద్దరి కాంబో సన్నివేశాలు తప్పకుండా ఆకట్టుకునే విధంగా ఉంటాయని అంటున్నారు. కేజీఎఫ్‌ లో హీరోయిన్ పాత్రకు పెద్ద గా ప్రాముఖ్యత ఉండదు. కాని సలార్ సినిమా కథలో ఇద్దరు హీరోయిన్స్ కు చాలా ప్రాముఖ్యత ఉంటుందట. అందుకే శృతి హాసన్ తో పాటు మరో క్రేజీ బ్యూటీ అయిన మీనాక్షి చౌదరిని ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌ చివర్లో విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. మరో వైపు ప్రభాస్‌ నటిస్తున్న ఆదిపురుష్‌ సినిమా ను వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.