Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్ మరో రెండు సినిమాలు ఓటిటి కోసమేనట!!

By:  Tupaki Desk   |   10 July 2020 11:30 PM GMT
ఆ హీరోయిన్ మరో రెండు సినిమాలు ఓటిటి కోసమేనట!!
X
ప్రస్తుతం కరోనా మహమ్మారి వలన సినీ ఇండస్ట్రీలో పరిస్థితులు ఇప్పట్లో సర్దుకునేలా కనిపించడం లేదు. థియేటర్లు మూతపడి జనాలను ఇంట్లో కట్టి పడేసింది. ఇదివరకు ఫస్ట్ డే.. వీకెండ్ కలెక్షన్లు అంటూ లెక్కలేసేవారు. కానీ ఇప్పుడు సినిమా థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో కూడా తెలియని పరిస్థితి. ఒకవేళ థియేటర్లు ఓపెన్ అయినా మునుపటిలా సినీ ప్రేక్షకుల హంగామా ఉండదు. ప్రస్తుతం ఓటిటి ల హవా బాగా నడుస్తుంది. అందుకే దర్శక నిర్మాతలు ఓటిటిల వైపు మళ్లుతున్నారు. ఇటీవలే భారీ అంచనాలతో అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన సినిమా పెంగ్విన్. ఈ సినిమాలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించింది. మహానటి సినిమా తరువాత కీర్తి చేసిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ఇది. ఈ సినిమా తర్వాత కీర్తి చేతిలో మిస్ ఇండియా.. గుడ్ లక్ సఖీ.. సినిమాలు లైన్ లో ఉన్నాయి.

కీర్తి కూడా కేవలం లేడీ ఓరియెంటెడ్ సినిమాల చక్రంలో ఇరుక్కుంటుందేమో అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే మహానటి.. పెంగ్విన్.. మిస్ ఇండియా.. గుడ్ లక్ సఖీ సినిమాలు అదే కోవకు చెందినవి. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వెళ్తే అవకాశాలు తగ్గే ఛాన్స్ ఉంది. ఎందుకంటే లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు గ్లామరస్ రోల్స్ చేస్తే బాగుంటుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. కానీ ఆ మధ్య కీర్తి గ్లామర్ రోల్స్ చేయనని చెప్పింది. అలాంటప్పుడు ఆ జోనర్ వీడి కాస్త హీరోల పక్కన రోల్స్ కూడా చేస్తే కమర్షియల్ గా మంచి పేరు వస్తుంది. ఇదిలా ఉండగా అమ్మడు నటిస్తున్న మరో రెండు సినిమాలు ఓటిటిలో విడుదల కానున్నాయట. అవే మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ సినిమాలు. ఇక హీరోలతో రొమాన్స్ అంటే.. ప్రస్తుతం కీర్తి చేతిలో నితిన్ హీరోగా రంగ్ దేతో పాటు మరో సినిమా ఓకే అయింది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా 'సర్కారు వారి పాట' సినిమాలు ఉన్నాయి.