Begin typing your search above and press return to search.

మ‌రో స్టార్ క‌పుల్ పెళ్లికి రెడీ.. హింట్ ఇదిగో!

By:  Tupaki Desk   |   23 Aug 2022 4:35 AM GMT
మ‌రో స్టార్ క‌పుల్ పెళ్లికి రెడీ.. హింట్ ఇదిగో!
X
చాలా కాలంగా కియ‌రా అద్వాణీ- సిద్ధార్థ్ మ‌ల్హోత్రా జంట ప్రేమాయ‌ణం గురించి మీడియాలో డిబేట్ ర‌న్ అవుతోంది. ఈ జంట రేపో మాపో పెళ్లాడేయ‌బోతున్నారంటూ క‌థ‌నాలు కూడా వెలువ‌డుతున్నాయి. అయితే కియ‌రా కానీ సిధ్ కానీ ఇప్ప‌టివ‌ర‌కూ త‌మ డేటింగ్ వ్య‌వ‌హారాన్ని మాత్రం బ‌య‌ట‌పెట్ట‌లేదు. ఇంత‌కుముందు క‌ర‌ణ్ జోహార్ షోలో సిద్ధార్థ్ ఒక చిన్న హింట్ మాత్ర‌మే ఇచ్చాడు. మేం మంచి స్థానంలో ఉంటామ‌ని మాత్ర‌మే అన్నాడు.

కరణ్ జోహార్ పాపులర్ చాట్ షో 'కాఫీ విత్ కరణ్‌'లో త‌దుప‌రి కియారా అద్వానీ తమ సంబంధంపై ఓపెన‌య్యే సమయం వచ్చింది. KWK సీజన్ 7 చివరి ఎపిసోడ్ లో ఇప్ప‌టికే సిద్ధార్థ్ త‌న లేడీ ల‌వ్ తో తన సంబంధాన్ని దాదాపుగా ధృవీకరించాడు. వీరిద్దరూ కరణ్‌ నిర్మాణంలో 'షేర్ షా'లో కలిసి న‌టించారు. ఆ స‌మ‌యంలో ఇరువురి న‌డుమా ఆఫ్ లైన్ రొమాన్స్ గురించి గొప్ప చ‌ర్చ సాగింది.

ఇప్పుడు కాఫీ విత్ కరణ్ తదుప‌రి ఎపిసోడ్ నుండి కొత్త ప్రోమో విడుద‌లైంది. ఇందులో కియారా తన 'కబీర్ సింగ్' సహనటుడు షాహిద్ కపూర్ తో కాఫీ ని షేర్ చేసుకుంది. ప్రోమోలో కియారా- సిద్ధార్థ్ ఈ ఏడాది చివరి నాటికి పెళ్లి చేసుకునే అవకాశం ఉందని షాహిద్ వ్యాఖ్యానించాడు. ''ఈ ఏడాది చివర్లో ఎప్పుడైనా పెద్ద ప్రకటన కోసం సిద్ధంగా ఉండండి.. అది సినిమా కాదు.. నిజం!'' అని షాహిద్ ఈ వీడియో క్లిప్ లో చెప్పాడు. కియారా - సిద్ధార్థ్ జంట ఎంతో 'అందంగా" కనిపిస్తున్నారని షాహిద్ ప్ర‌శంసించాడు. వారు చాలా అందంగా కనిపించే జంట అని అత‌డు అన‌గానే.. దీనికి కరణ్ ''బచ్చే కమల్ కే హోంగే (వారి పిల్లలు చాలా అందంగా ఉంటారు)'' అంటూ పంచ్ ని కంటిన్యూ చేశాడు.

కియారా అద్వానీ - సిద్ధార్థ్ మల్హోత్రా జంట 'షేర్షా' కోసం కలిసి నటించినప్పటి నుండి వారి డేటింగ్ వ్య‌వ‌హారంపై పుకార్లు మ‌రింత ఎక్కువ‌య్యాయి. కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత వీరిద్దరూ విడిపోయారంటూ కొన్ని నెలల క్రితం పుకార్లు షికార్లు చేశాయి. కానీ అది నిజం కాలేదు. ఇటీవ‌ల‌ సిద్ధార్థ్ ముంబైలో కియారా చిత్రం భూల్ భూలయ్యా 2 స్క్రీనింగ్ కు హాజరై అన్ని పుకార్ల‌కు చెక్ పెట్టాడు. స్క్రీనింగ్ వేదిక వద్ద ఈ జంట కలిసి ఫోటోల‌కు ఫోజులివ్వ‌డమే గాక కియ‌రాను గ‌ట్టిగా కౌగిలించుకున్నాడు. దుబాయ్ లో కియ‌రా పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను ఆమె కుటుంబంతో కలిసి మ‌ల్హోత్రా జరుపుకున్నారు.

తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కథనాలపై కియ‌రా తాజా ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ -''నా వ్యక్తిగత జీవితం గురించి ఎప్పటికీ మాట్లాడకూడదని ఇప్పటికే నిర్ణయించుకున్నాను. దానిపై నేను ఎప్పుడూ వ్యాఖ్యానించలేదు. ప్రజలు తమకు ఏమి కావాలో అది ఊహించుకోగలరు. నేను ఎప్పటికీ ధృవీకరించను లేదా తిరస్కరించను.. ఎందుకంటే ఇది నా జీవితంలో ప్రైవేట్ అంశం'' అని అన్నారు.

సిద్ధార్థ్ -కియారా జంట‌ ఇటీవల 'షేర్షా' మొద‌టి వార్షికోత్స‌వ వేడుక‌ల‌ను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఇన్ స్టాగ్రామ్ లో నిర్వహించిన లైవ్ సెషన్ లో మ‌ళ్లీ ఈ జంట‌ కలిసి సినిమా చేసే అవకాశం గురించి చర్చించారు.