Begin typing your search above and press return to search.

'రాజమౌళి-మహేష్' ప్రాజెక్ట్ పై మరో కొత్త రూమర్..!

By:  Tupaki Desk   |   20 April 2021 6:30 AM GMT
రాజమౌళి-మహేష్ ప్రాజెక్ట్ పై మరో కొత్త రూమర్..!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' సినిమా తర్వాత మహేష్ తోనే సినిమా ఉంటుందని రాజమౌళి లాక్ డౌన్ లో క్లారిటీ ఇచ్చాడు. అప్పటి నుంచి వీరి కలయికలో ఎలాంటి సినిమా వస్తుందో అనే ఆసక్తి అందరిలో ఎక్కువైంది. ఈ నేపథ్యంలో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. మహేష్ కోసం ఓ జంగిల్ బేస్డ్ అడ్వెంచర్ స్టోరీ లైన్ అనుకుంటున్నామని బాలీవుడ్ మీడియాతో చెప్పుకొచ్చారు. ఇకపోతే ఈ ప్రాజెక్ట్ గురించి రోజుకో రూమర్ వినిపిస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా మరో పుకారు పుట్టుకొచ్చింది.

అదేంటంటే 'జక్కన్న-మహేష్' ప్రాజెక్ట్ ని ఈ ఏడాది విజయదశమి సందర్భంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభిస్తారని.. ఇయర్ ఎండింగ్ లో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నారని అంటున్నారు. ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లినా 2023 సంక్రాంతికి విడుదల చేస్తారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ రూమర్ నిజం కాకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం రాజమౌళి 'ఆర్.ఆర్.ఆర్' సినిమా చిత్రీకరణ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు. దీని తర్వాత రాజమౌళి కాస్త బ్రేక్ తీసుకొని కానీ మహేష్ సినిమా మీద వర్క్ స్టార్ట్ చేయడు. అందులోను మహేష్ 'సర్కారు వారి పాట' సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తారని అంటున్నారు. దీనిని బట్టి చూస్తే మహేష్ - రాజమౌళి సినిమా స్టార్ట్ అవడానికి ఇంకా సమయం పట్టనుందని అర్థం అవుతుంది.

కాగా, మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్లో సినిమా చేయాలని ఎప్పటి నుండో సినీ అభిమానులు కోరుకుంటున్నారు. నిజానికి పదేళ్ల క్రితమే ఓ ప్రాజెక్ట్ గురించి వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. కానీ అవి కార్యరూపం దాల్చలేదు. ఇన్నేళ్ల తర్వాత కలుస్తున్న ఈ కాంబోపై అభిమానుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే.ఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించనున్నారు.