Begin typing your search above and press return to search.

మారుతీ లైనప్ లో ప్రభాస్ చిరులతో పాటుగా మరో మెగా హీరో..!

By:  Tupaki Desk   |   9 July 2022 4:46 AM GMT
మారుతీ లైనప్ లో ప్రభాస్ చిరులతో పాటుగా మరో మెగా హీరో..!
X
'ఈరోజుల్లో' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన మారుతి.. 'ప్రేమకథా చిత్రమ్' - 'భలే భలే మగాడివోయ్' - 'మహానుభావుడు' - 'ప్రతిరోజూ పండగే' వంటి చిత్రాలతో మంచి సక్సెస్ అందుకున్నారు. మధ్యలో కొన్ని ప్లాప్స్ కూడా చవిచూశారు.

కెరీర్ ప్రారంభంలో యూత్ ఫుల్ కంటెంట్ తో అలరించిన దర్శకుడు.. ఆ తర్వాత ట్రాక్ మార్చి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథలతో వస్తున్నారు. ప్రస్తుతం మారుతీ చేతిలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - మెగాస్టార్ చిరంజీవి వంటి అగ్ర హీరోల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మారుతి లైనప్ లోకి కొత్తగా మరో మెగా హీరో వచ్చాడని టాక్ వినిపిస్తోంది.

పాండమిక్ టైంలో 'మంచి రోజులొచ్చాయి' అనే సినిమాతో ఫ్లాప్ అందుకున్న మారుతీ.. లేటెస్టుగా గోపీచంద్ తో కలిసి 'పక్కా కమర్షియల్' చిత్రంతో పలకరించాడు. అయితే ఈ మూవీ రిలీజ్ అవ్వకముందే ప్రభాస్ మరియు చిరు లతో వర్క్ చేసే అవకాశం అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్న ప్రభాస్.. మారుతి చెప్పిన లైన్ నచ్చడంతో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ గురించి చాలా రోజులుగా రూమర్స్ వస్తున్నాయి కానీ.. ఈమధ్యే పలు ఇంటర్వ్యూలలో దర్శకుడు ధృవీకరించారు.

ఈ నేపథ్యంలో ప్రభాస్ డెసిజన్ పై ఫ్యాన్స్ కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. భారీ చిత్రాల మధ్య మారుతీతో వెళ్ళడం సరైన నిర్ణయం అనిపించుకోదని సోషల్ మీడియా వేదికగా డార్లింగ్ కు రిక్వెస్టులు పెట్టారు. ఇలాంటి సమయంలో మెగాస్టార్ కూడా దర్శకుడితో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు.

పక్కా కమర్షియల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్టుగా వచ్చిన చిరంజీవి.. మారుతీ తో మూవీ గురించి స్టేజీ మీదే చెప్పారు. దీనికి మెగా ఫ్యాన్స్ ససేమిరా అంటున్నారు. క్రేజీ డైరెక్టర్ తో ప్రాజెక్ట్స్ చేయాలని తమ అభిమాన హీరోని కోరుతున్నారు.

విక్టరీ వెంకటేశ్ మినహా దర్శకుడు ఇప్పటి వరకు పెద్ద హీరోలతో సినిమాలు చేయలేదు. చేసిన 'బాబు బంగారం' మూవీ కూడా ప్లాప్ అయింది. అందుకే మెగా - డార్లింగ్ అభిమానులు మారుతీ తో సినిమా అనగానే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

దీనికి తగ్గట్టుగానే 'పక్కా కమర్షియల్' ఫలితం వచ్చింది. ఫస్ట్ వీకెండ్ లో మంచి వసూళ్లను రాబట్టిన ఈ సినిమా.. వీక్ డేస్ లో బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది. మారుతీ మార్క్ కామెడీ కూడా మిస్ అయిందనే కామెంట్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు తన ప్లాన్స్ అన్నీ చేంజ్ చేసుకున్నారని టాక్ నడుస్తోంది.

ప్రభాస్ మరియు చిరంజీవి ప్రాజెక్ట్స్ కంటే ముందుగా ఓ బ్లాక్ బస్టర్ కొట్టి తన సత్తా ఏంటో చూపించాలని మారుతి భావిస్తున్నారట. ఇందులో భాగంగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో ఓ మూవీ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

మారుతీ - సాయి తేజ్ కాంబినేషన్ లో ఇంతకముందు 'ప్రతిరోజే పండగే' సినిమా తెరకెక్కింది. ఇటీవలి కాలంలో ఇది ఇద్దరి కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్ సినిమా. ఇప్పుడు వీరిద్దరూ మరో మూవీ చేయడానికి రెడీ అవుతున్నారట. ఈ ప్రాజెక్ట్ తో హిట్టు కొట్టి స్టార్ హీరోల దగ్గరకు వెళ్లాలని అనుకుంటున్నారట. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.