Begin typing your search above and press return to search.

ర‌ష్మిక ఖాతాలో మ‌రో క్రేజీ ప్రాజెక్ట్

By:  Tupaki Desk   |   5 April 2022 11:36 AM GMT
ర‌ష్మిక ఖాతాలో మ‌రో క్రేజీ ప్రాజెక్ట్
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'పుష్ప ది రైజ్‌'. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచి వ‌సూళ్ల ప‌రంగా స‌రికొత్త రికార్డులు సృష్టించింది. ఈ మూవీతో అల్లు అర్జున్ , ఇందులో న‌టించిన ర‌ష్మిక మంద‌న్న కూడా పాన్ ఇండియా స్టార్ లుగా మారిపోయారు. ఈ మూవీకి ముందే బాలీవుడ్ లో పాగా వేయ‌డం మొద‌లుపెట్టిన ర‌ష్మిక తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్ట్ ల‌ని సొంతం చేసుకుంటూ వ‌రుస‌గా షాకులిస్తోంది.

మంగ‌ళ‌వారం పుట్టిన రోజు సంద‌ర్భంగా వ‌రుస క్రేజీ ప్రాజెక్ట్ ల‌ని ప్ర‌క‌టించేస్తోంది. బాలీవుడ్ క్రేజీ మూవీ 'యానిమ‌ల్‌'లో ర‌ణ్ బీర్ క‌పూర్ కు జోడీగా ఫిక్స్ అయిన ర‌ష్మిక అదే ఊపులో దుల్క‌ర్ స‌ల్మాన్ తో హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్క‌తిస్తున్న పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామా లోనూ న‌టించే అవ‌కాశాన్ని ద‌క్కించుకుంది. తాజాగా మ‌రో క్రేజీ ఆఫ‌ర్‌ని సొంతం చేసుకుని షాకిస్తోంది. త‌మిళ సూప‌ర్ స్టార్ ఇళ‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా వంశీ పైడిప‌ల్లి ఓ భారీ బైలింగ్వ‌ల్ మూవీని తెర‌పైకి తీసుకురాబోతున్నారు.

స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు అత్యంత భారీ స్థాయిలో నిర్మించ‌నున్న ఈ చిత్రంలో విజ‌య్ కి జోడీగా న‌టించే క్రేజీ ఆఫ‌ర్ ని ర‌ష్మిక మంద‌న్న ద‌క్కించుకుంది. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు, శిరీష్ తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక కాలంలో ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. విజ‌య్ న‌టించ‌నున్న 66వ చిత్ర‌మిది. మంగ‌ళ‌వారం ర‌ష్మిక మంద‌న్న పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం తాము నిర్మించ‌నున్న భారీ ప్రాజెక్ట్ లో విజ‌య్ కి జోడీగా ర‌ష్మిక న‌టించ‌నుంద‌ని ప్ర‌క‌టించారు.

ప‌వ‌ర్ ఫుల్ క‌థ‌తో రూపొంద‌నున్న ఈ మూవీలో విజ‌య్ ని స‌రికొత్త అవ‌తారంలో ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి చూపించ‌నున్నారట‌. ఇప్ప‌టికే స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్త‌యిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని త్వ‌ర‌లో ప్రారంభించ‌బోతున్నార‌ట‌. ఇందుకు సంబంధించిన ప్ర‌క‌ట‌న‌ని త్వ‌ర‌లోనే చిత్ర బృందం విడుద‌ల చేయ‌నుంద‌ని తెలిసింది.

ఇదిలా వుంటే హీరో విజ‌య్ న‌టించిన 65వ చిత్రం 'బీస్ట్‌' ఏప్రిల్ 13న ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టికే ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డిన విష‌యం తెలిసింది.

అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్ర గీతాలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారి రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ మూడు క్రేజీ ప్రాజెక్ట్ ల‌తో పాటు ర‌ష్మిక మంద‌న్న 'పుష్ప -2' లోనూ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా త‌న‌కు పెరిగిన డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని ర‌ష్మిక 'పుష్ప 2' కోసం భారీగా డిమాండ్ చేస్తోంద‌ట‌. ఇప్ప‌టికే హీరో బ‌న్నీ, సుకుమార్ పార్ట్ 1 కు మించి పార్ట్ 2 కోసం రెట్టించిన మొత్తాన్ని రెమ్యున‌రేష‌న్ గా తీసుకోబోతున్నారు. వారి త‌ర‌హాలోనే ర‌ష్మిక కూడా డిమాండ్ చేయ‌డంతో ఆమె డిమాండ్ కు మేక‌ర్స్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టుగా తెలిసింది.