Begin typing your search above and press return to search.

బ‌న్ని అంకిత‌భావానికి యాంక‌ర్ కం న‌టి ఫిదా

By:  Tupaki Desk   |   23 May 2021 5:30 AM GMT
బ‌న్ని అంకిత‌భావానికి యాంక‌ర్ కం న‌టి ఫిదా
X
రామ్ చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం చిత్రంలో రంగ‌మ్మ‌త్త‌గా న‌టించిన అన‌సూయ ఇప్పుడు బ‌న్ని పుష్ప చిత్రంలోనూ ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. అయితే నాలుగు రోజుల చిత్రీక‌ర‌ణ అనంత‌రం కోవిడ్ ఉధృతి వ‌ల్ల సెట్లో బ‌న్నీకి కోవిడ్ సోక‌డంతో షూటింగ్ ని వాయిదా వేశారు. బ‌న్ని కోవిడ్ కి చికిత్స పొంది కోలుకున్న సంగ‌తి తెలిసిందే.

లాక్ డౌన్ కార‌ణంగా ప్ర‌స్తుతం పుష్ప చిత్రీక‌ర‌ణ నిలిచిపోయింది. తాజా చిట్ చాట్ లో అన‌సూయ మాట్లాడుతూ పుష్ప సెట్లో ఉన్న నాలుగు రోజుల్లోనే అల్లు అర్జున్ వ్య‌క్తిత్వంతో ప్రేమ‌లో ప‌డిపోయాన‌ని అంటున్నారు. బ‌న్ని చేసే ప‌ని పట్ల ఉన్న నిబద్ధత అంకితభావం క‌లిగి ఉన్న స్టార్ . అత‌డు బహుముఖ ప్రజ్ఞాశాలి అని పొగిడేశారు. అత‌డు ఎన్ని సినిమాలు చేసినా ప్ర‌తి సినిమాని మొద‌టి సినిమా అనుకుని శ్ర‌మిస్తారు.. అని తెలిపారు.

అల్లు అర్జున్ పాత్రను తెర‌పై వీక్షిస్తే ప్రేక్షకులు చెలరేగిపోతారని ఆమె తెలిపారు. రెండవ సారి సుకుమార్ తో ప‌ని చేస్తున్నాను. ఆయ‌న‌తో కలిసి పనిచేయడం ఎల్లప్పుడూ సరదాగా ఉంటుందని.. అతను ది బెస్ట్ గా ఆర్టిస్టుల‌తో క‌లిసిపోతార‌ని తెలిపారు. సుకుమార్ సెట్స్ లో ఉండటం తనకు బెస్ట్ అనిపిస్తుంద‌ని అనసూయ చెప్పారు. ఇక పుష్ప చిత్రంలో త‌న పాత్ర ఎలా ఉంటుంది? అన్న‌దానికి ఎలాంటి క్లూ ఇవ్వ‌లేదు.

అన‌సూయ న‌టించిన‌ థాంక్యూ బ్రదర్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో ప‌లు క్రేజీ చిత్రాల్లో న‌టిస్తోంది. తమిళం మలయాళంలో కూడా ఇతర ప్రాజెక్టులను కలిగి ఉంది.