Begin typing your search above and press return to search.

ఈమైనా క్లిక్‌ అయ్యేనా?

By:  Tupaki Desk   |   6 Jan 2019 3:30 AM GMT
ఈమైనా క్లిక్‌ అయ్యేనా?
X
ఏ భాష సినిమా ఇండస్ట్రీ అయినా వారసత్వం అనేది చాలా కామన్‌ విషయం. ఇండస్ట్రీలో వారసులు ఎంట్రీ ఇవ్వడం ఇప్పటిది కాదు, ఎప్పటి నుండే వస్తుంది. అయితే బాలీవుడ్‌ లో మాత్రం కేవలం హీరోలు మాత్రమే కాకుండా హీరోయిన్స్‌ కూడా వారసులుగా ఎంట్రీ ఇస్తూ ఉంటారు. బాలీవుడ్‌ లో ఇప్పటి వరకు హీరోయిన్స్‌ గా వారసులు ఎంతో మంది ఎంట్రీ ఇచ్చారు. అయితే హీరోయిన్స్‌ గా ఎంట్రీ ఇచ్చిన వారసులు ఎక్కువ శాతం సక్సెస్‌ లను దక్కించుకోవడం లో విఫలం అయ్యారు.

ప్రస్తుతం బాలీవుడ్‌ దృష్టిని ఆకర్షిస్తున్న ముగ్గురు వారసులు జాన్వీ కపూర్‌ - సారా అలీఖాన్‌ - అనన్య. ఈ ముగ్గురిలో ఇప్పటికే జాన్వీ కపూర్‌ ధడక్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక మోస్తరు సక్సెస్‌ ను దక్కించుకుంది. సారా అలీఖాన్‌ ఇప్పటికే రెండు సినిమాలను విడుదల చేసింది. మొదటి సినిమా ఫ్లాప్‌ అయినా తాజాగా వచ్చిన ‘సింబా’తో సక్సెస్‌ ను దక్కించుకుంది. అయితే సారా అలీఖాన్‌ కు హీరోయిన్‌ గా స్టార్‌ డం మాత్రం ఇంకా రాలేదని చెప్పాలి. ఇక చుంకీ పాండే కూతురు అనన్య కూడా హీరోయిన్‌ గా పరిచయం కాబోతుంది.

బాలీవుడ్‌ లో తెరకెక్కుతున్న ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ చిత్రానికి సీక్వెల్‌ గా రూపొందుతున్న చిత్రంలో అనన్య హీరోయిన్‌ గా నటిస్తోంది. అందంతో పాటు అభినయంతో కూడా ఈ అమ్మడు ఆకట్టుకుంటుందనే నమ్మకంను చిత్ర యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా అనన్య మొదటి సినిమాతోనే సక్సెస్‌ దక్కించుకుని స్టార్‌ డంను దక్కించుకుంటుందని అంటున్నారు. అనన్య పై ఆమె సన్నిహితులతో పాటు, బాలీవుడ్‌ వర్గాల వారు కూడా చాలా నమ్మకంతో ఉన్నారు. సోషల్‌ మీడియాలో అనన్యకు భారీ ఫాలోయింగ్‌ ఉంది. ఈమె మొదటి సినిమా సక్సెస్‌ అయితే స్టార్‌ హీరోయిన్‌ గా నిలుస్తుందంటున్నారు. మరి అనన్య అయినా వారసత్వంతో క్లిక్‌ అయ్యేనా చూడాలి.