Begin typing your search above and press return to search.

'లైగర్' కు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్న అనన్య పాండే

By:  Tupaki Desk   |   28 Oct 2021 12:30 PM GMT
లైగర్ కు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్న అనన్య పాండే
X
పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ''లైగర్''. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా ప్రభావం వల్ల ఇప్పటికే షూటింగ్ ఆలస్యంగా జరుపుకుంటున్న ఈ చిత్రానికి.. అనన్య కారణంగా ఇబ్బంది కలుగుతుందేమో అనుకునే పరిస్థితి ఏర్పడింది.

షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్టైన డ్రగ్ కేసులో అనన్య పాండే కూడా విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆర్యన్ తో అనన్య వాట్సాఫ్ లో డ్రగ్స్ చాట్ చేసిందనే సాక్ష్యాలు దొరకడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆమెను ప్రశ్నించారు. ఆర్యన్ తో వీడ్ - చరాస్ వంటి నిషేధిత మాధకద్రవ్యాల గురించి అనన్య చర్చినట్లు ఎన్సీబీ కోర్టుకు నివేధించింది.

ఇప్పటికే అనన్య పాండే ను రెండు సార్లు విచారించిన ఎన్సీబీ అధికారులు.. మరింత లోతుగా సమాచారం రాబట్టడానికి మళ్ళీ ప్రశ్నించడానికి రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో అనన్య చుట్టూ ఉచ్చు బిగుస్తుందేమో.. ఆమె నటిస్తున్న సినిమాల మీద ప్రభావం పడుతుందేమో అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

అయితే డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్నా.. 'లైగర్' షూటింగ్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా అనన్య వ్యవహరిస్తోందట. ఈరోజు జరిగే షూటింగ్ లో ఈ బ్యూటీ కూడా పాల్గొంటోందట. ప్రస్తుతం 'లైగర్' లో ఓ సాంగ్ కు సంబంధించిన షూటింగ్ ముంబై లో జరుగుతోంది. రాయల్ పామ్స్ లోని డ్రీమ్ స్టూడియోలో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు.

బాబా బాస్కర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్న ఈ మాస్ నంబర్ లో విజయ్ దేవరకొండ తో పాటుగా అనన్య పాండే కూడా పాల్గొనాల్సి ఉంది. ఇద్దరి కాంబోలో మరో రెండు రోజుల్లో షూట్ పూర్తి చేస్తారని సమాచారం. కొన్ని రోజుల 'లైగర్' షూటింగ్ తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అనన్య కేసు వ్యవహారాల్లో ఉండటంతో విజయ్ కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారట.

'రొమాంటిక్' ప్రీమియర్ కోసం హైదరాబాద్ వచ్చిన పూరీ జగన్నాథ్.. ఈరోజు నుంచి మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టారట. ఇందులో అనన్య పాండే కూడా జాయిన్ అవుతుండటంతో.. వీలైనంత త్వరగా ఆమె సీన్స్ షూట్ చేయాలని దర్శకనిర్మాతలు ఆలోచిస్తున్నారట. మరి రాబోయే రోజుల్లో ఎన్సీబీ మళ్ళీ విచారణకు పిలిస్తే అనన్య ఎలా మేనేజ్ చేస్తుందో చూడాలి.

కాగా, ''లైగర్'' చిత్రాన్ని పూరి కనెక్ట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాధ్ - ఛార్మి కౌర్ - కరణ్ జోహార్ మరియు అపూర్వ మెహతా కలసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో లెజెండరీ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ అతిధి పాత్రలో కనిపించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.