Begin typing your search above and press return to search.

అమితాబ్ తో ప‌వ‌న్-ప్ర‌భాస్ అల్పాహారం

By:  Tupaki Desk   |   17 Feb 2022 4:31 AM GMT
అమితాబ్ తో ప‌వ‌న్-ప్ర‌భాస్ అల్పాహారం
X
ఒకే స్టూడియోలో వ‌రుస షూటింగులు జ‌రుగుతుంటే అక్క‌డ తార‌లు ఒక‌రితో ఒక‌రు క‌ల‌వ‌డం క‌లిసి లంచ్ లు బ్రేక్ ఫాస్ట్ లు చేయ‌డం స‌హ‌జం. ఇప్పుడు అలాంటి ఒక మంచి అవ‌కాశం క‌లిగింది ఆ ముగ్గురు టాప్ స్టార్ల‌కు. బిగ్ బి అమితాబ్ తో క‌లిసి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ బ్రేక్ ఫాస్ట్ చేశారు. అది కూడా రామోజీ ఫిలింసిటీలో. ఇలాంటి అవ‌కాశం చాలా రేర్ అనే భావించాలి.

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌టికే భీమ్లా షూటింగ్ ని ముగించారు. చివరి రోజు భీమ్లా నాయక్ షూటింగ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ సెట్స్ లో చాలా మందిని కలిశారు. అదే పరిసరాల్లో షూటింగ్ జరుపుకుంటున్న బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ .. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ల‌తో క‌లిసి బ్రేక్ ఫాస్ట్ చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది. రామోజీ ఫిలింసిటీలోనే నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ K కోసం ప్రభాస్ - అమితాబ్ బచ్చన్ పూర్తి బిజీగా ఉన్నారు. అమితాబ్ జీ RFC సమీపంలోని లొకేషన్ లో షూటింగ్ చేస్తున్నారని పవన్ తెలుసుకున్నారు. అమితాబ్ బచ్చన్ ను పవన్ స్వయంగా వెళ్లి క‌లిసారు. అమితాబ్ కూడా పవన్ - ప్రభాస్ లను చ‌క్కగా రిసీవ్ చేసుకున్నారని తెలిసింది. ఒకరితో ఒక‌రు క‌లిసాక‌.. ప్రభాస్ తో పాటు పవన్ కళ్యాణ్.. బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో అల్పాహారం తిన్నారు. ముగ్గురు పెద్ద స్టార్స్ ఒకేచోట క‌లిసి ఇలా కబుర్లు చెప్పుకోవడం చూస్తుంటే ఎంతో అద్భుతంగా ఉందని చూపరులు అంటున్నారు.

భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25 విడుదలకు సిద్ధంగా ఉన్నందున పవన్ అమితాబ్ కు బై బై చెప్పి తన షూటింగ్ స్పాట్ కి వెళ్లార‌ట‌. ఇంకా ఆ ముగ్గురు ఒకే ఫ్రేమ్ లో ఉన్న అరుదైన ఫోటో బ‌య‌ట‌కు రాలేదు. అమితాబ్ బచ్చన్ కి ప‌వ‌న్ వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. అతను అమితాబ్ పై గొప్ప గౌరవాన్ని కలిగి ఉన్నాడు. అతను ఇంతకు ముందు అనేక వేదికలపై బహిరంగంగా తాను అమితాబ్ కి అభిమానిని అని ప్ర‌క‌టించారు. అందుకే అమితాబ్‌తో గడపడం చాలా సంతోషం ఫీల‌య్యార‌ట‌.

దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్ తో రూపొందుతున్న ప్రాజెక్ట్ కేలో అమితాబ్ పాత్ర ఎంతో కీల‌క‌మైన‌ది. దీపిక ప‌దుకొనే ఇందులో క‌థానాయిక‌. ఊహాజనిత మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా క‌థ‌నం సాగుతుంద‌ని తెలిసింది. ఈ చిత్రంలో హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయి. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మెగా త్ర‌యం `చిరు-ప‌వ‌న్-నాగ‌బాబు` పంక్తి బోజ‌నం!

ఆన్ లొకేష‌న్ ఇలాంటి అరుదైన దృశ్యాలు ఇటీవ‌ల చాలా రేర్ గా క‌నిపిస్తున్నాయి. ఇంత‌కుముందు మెగా బ్ర‌ద‌ర్స్ త‌మ మాతృమూర్తి అంజ‌నా దేవితో క‌లిసి ఆన్ లొకేష‌న్ పంక్తి భోజ‌నం చేయ‌డం క‌నువిందు చేసింది. మెగాభిమానుల‌ క‌ళ్లు చెదిరే త‌నువు పుల‌కించి త‌న్మ‌యానికి గుర‌య్యే రేర్ మూవ్ మెంట్ అది. త‌మ అభిమాన దేవుళ్లు మెగాస్టార్ చిరంజీవి... ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ముగ్గురూ ఒకే చోట కూచుని పంక్తి భోజ‌నం చేశారు. ఆస‌క్తిక‌రంగా ఆ ముగ్గురికీ వ‌డ్డిస్తూ అక్క‌డే త‌మ మాతృమూర్తి అంజ‌నాదేవి కొణిదెల కూడా భోజ‌నం చేశారు. ఈ అరుదైన దృశ్యం..17-08-22 మంగ‌ళ‌వారం లంచ్ స‌మ‌యంలో క‌నిపించింది. ఇంత‌కీ లొకేష‌న్ ఎక్క‌డ‌? అంటే.. అది హైద‌రాబాద్ శివారులోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో ఈ సంద‌ర్భం క‌లిసొచ్చింది.

ఇంత‌కీ బ్ర‌ద‌ర్స్ ముగ్గురూ అక్క‌డే ఏం చేస్తున్నారు? అంటే యాథృచ్ఛికంగా అంతా ఒకేచోట షూటింగుల్లో ఉన్నారు. అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి `లూసీఫ‌ర్` రీమేక్ `గాడ్ ఫాద‌ర్` షూటింగ్ జ‌రుగుతోంది. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆ ప‌క్క‌నే ప‌వ‌న్ క‌ల్యాణ్ షూటింగ్ కూడా జ‌రుగుతోంది. ప‌వ‌న్ -రానా హీరోలుగా సాగ‌ర్ చంద్ర తెర‌కెక్కిస్తున్న భీమ్లా నాయ‌క్ (అయ్య‌ప్ప‌నుమ్ కోషియం) షూటింగ్ ఇది. ఇక ఇదే చోట మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు షూటింగ్ కూడా జ‌రుగుతోంది. దివంగ‌త వెట‌ర‌న్ న‌టి విజ‌య‌నిర్మ‌ల మ‌న‌వ‌డు న‌వీన్ విజ‌య్ కృష్ణ క‌థానాయ‌కుడిగా నాగబాబు కీల‌క పాత్ర‌లో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. శివ ద‌ర్శ‌క‌త్వంలో సుధాక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అయితే ఒకే లొకేష‌న్ లో మెగాబ్ర‌ద‌ర్స్ ముగ్గురూ షూటింగ్ చేయ‌డం యాథృచ్ఛికం అనుకుంటే .. ఆ ముగ్గురూ ఒకే చోట కూచుని లంచ్ చేయ‌డం అంతే క‌న్నుల‌పండుగ‌ను త‌ల‌పించింది. ఇక పంక్తి భోజ‌నం లో త‌న‌యుల‌కు వ‌డ్డించేందుకు త‌మ మాతృమూర్తి అంజ‌నాదేవి కొణిదెల‌ నేరుగా అల్యూమినియం ఫ్యాక్ట‌రీకి విచ్చేయ‌డంతో ఆ దృశ్యం మ‌రింత రంజుగా మారింది. ఇక అంజ‌నాదేవి గారు త‌న‌యుల‌కు క్యారేజీ నుంచి రుచిక‌ర‌మైన వంట‌కాల‌ను వ‌డ్డించారు. ఆ ముగ్గురితో క‌లిసి లంచ్ కూడా చేశారు. ఈ భోజ‌నాల స‌మ‌యంలో మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కూడా అక్క‌డే ఉండ‌డం మ‌రో హైలైట్.