Begin typing your search above and press return to search.

స్టార్ డైరెక్టర్లకు షాక్ ఇచ్చిన పవర్ స్టార్.. వారి సంగతేంటి?

By:  Tupaki Desk   |   20 Jun 2020 2:30 PM GMT
స్టార్ డైరెక్టర్లకు షాక్ ఇచ్చిన పవర్ స్టార్.. వారి సంగతేంటి?
X
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వకీల్ సాబ్ సినిమాతో మళ్లీ సినీ ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు మరో చిన్న షెడ్యూల్ మిగిలి ఉందట. త్వరలోనే అది కూడా పూర్తిచేద్దాం అనుకునేలోపు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసింది. అందుకే షూటింగ్స్ ఆపేసి ఎక్కడివారక్కడే ఇళ్లకు అంకితమయ్యారు. పవర్ స్టార్ కూడా వకీల్ సాబ్ షూటింగులో ఉండగానే మరో కొన్ని ప్రాజెక్ట్ లను లైన్లో పెట్టారట. ఇదిలా ఉండగా కరోనా భయంతో షూటింగ్స్ నిలిచిపోవడం వలన వకీల్ సాబ్ టీం అంతా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించిందట. ప్రస్తుతం వరుసగా మూడు ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కోరిన దానికి రెట్టింపు చేశారు పవన్.

ఆయన నుండి మొదటగా వకీల్ సాబ్ విడుదల కానుంది. అలాగే డైరెక్టర్ క్రిష్ తో 'విరూపాక్ష', ఆ తరువాత గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమాలు వస్తాయని అందరూ ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సినిమా తప్ప మిగతా సినిమాలేవీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆయన వకీల్ సాబ్ షూట్ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడట. దీనికి తక్కువ సిబ్బంది సరిపోతుందట. పవన్ కూడా ఈ చిత్రం కేవలం 15 రోజుల్లో పూర్తి చేయనున్నాడట. ఇక తన తదుపరి ప్రాజెక్ట్ క్రిష్ సినిమా నిలిపివేసి.. హరీష్ శంకర్ ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తారని ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ విషయం తెలిసి నిర్మాత ఎ.ఎం. రత్నం చాలా బాధపడ్డాడట. కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ ప్రాజెక్ట్.. హరీష్ శంకర్ ప్రాజెక్ట్ రెండింటి గురించి ఆలోచించట్లేదట. క్రిష్ సినిమా చారిత్రక నేపథ్యంలో సాగుతుంది కాబట్టి చిత్రీకరణకు వందలాది మంది సిబ్బంది అవసరం. అందుకే క్రిష్ ఎ.ఎం.రత్నం ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ పై ఇప్పటి వరకు ఒత్తిడి పెట్టలేదట. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ ఏ ప్రాజెక్ట్ గురించి ఆలోచన చేయట్లేదట. మరో ఆరు నెలలు గడిస్తే గాని ఏమి చెప్పలేం అంటున్నారట. చూడాలి మరి ఈ డైరెక్టర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో..!