Begin typing your search above and press return to search.

ఐకాన్ స్టార్ 'పుష్ప 2' మొద‌ల‌య్యేది అక్క‌డే!

By:  Tupaki Desk   |   23 Sep 2022 7:34 AM GMT
ఐకాన్ స్టార్ పుష్ప 2 మొద‌ల‌య్యేది అక్క‌డే!
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ ల జాబితాలో చేర్చిన యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'పుష్ప ది రైజ్‌'. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ మూవీ ద‌క్షిణాదితో పాటు ఉత్త‌రాదిలోనూ సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. అంతే కాకుండా హిందీ బెల్ట్ లో ఈ మూవీ ఊహించ‌ని విధంగా రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి అక్క‌డి మేక‌ర్స్ కి కంటి మీద కుపుకు లేకుండా చేసింది. దీంతో 'పుష్ప‌' బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలిచిన విష‌యం తెలిసిందే.

ఈ మూవీ రిలీజ్ త‌రువాత ఉత్త‌రాదిలో బ‌న్నీ క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఈ విష‌యాన్ని దృష్టిలో పెట్టుకున్న మేక‌ర్స్ 'పుష్ప 2' బ‌డ్జెట్ తో పాటు హిందీ డ‌బ్బింగ్ రైట్స్ విష‌యంలోనూ సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకోవ‌డం విశేషం. పార్ట్ 1 వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 350 కోట్లకు మించి రాబ‌డితే పార్ట్ 2 కోసం 350 కోట్ల బ‌డ్జెట్ ని మేక‌ర్స్‌ కేటాయించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టిస్తున్న ఈమూవీ రెగ్యులర్ షూటింగ్ ని త్వ‌ర‌లో ప్రారంభించ‌నున్న విష‌యం తెలిసిందే.

ద‌ర్శ‌కుడు సుకుమార్ స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తి చేయ‌డం తో ఈ మూవీని ఆగ‌స్టులో లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించారు. పార్ట్ 1 కి మించి పార్ట్ 2 భారీ స్థాయిలో వుంటుంద‌ని వార్త‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలో 'పుష్ప 2' ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళుతుందా? అని బ‌న్నీ ఫ్యాన్స్ తో పాటు అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. గ‌తంలో న‌వంబ‌ర్ నుంచి ఈ మూవీ సెట్స్ పైరి వెళుతుంద‌ని వార్తలు వినిపించాయి. అయితే తాజా వార్త‌ల ప్ర‌కారం అ మూవీని అక్టోబ‌ర్ లో మొద‌లు పెడుతున్న‌ట్టుగా తెలుస్తోంది.

అక్టోబ‌ర్ 1న ఈ పాన్ ఇండియా సంచ‌ల‌నాన్ని సెట్స్ పైకి తీసుకెళుతున్నార‌ట‌. అక్లోబ‌ర్ 1న అల్లు ఫ్యామిలీ అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా భావిస్తున్న 'అల్లు స్టూడియోస్'ని లాంఛ‌నంగా ప్రారంభించ‌బోతున్నారు.

ఇందు కోసం భారీ ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఔట‌ర్ రింగ్ రోడ్ స‌మీపంలోగ‌ల సొంత స్థ‌లంలో స‌ర్వాంగ సుంద‌రంగా అల్లు స్టూడియోస్ నిర్మాణం గ‌తంలో కొన్ని నెల‌ల క్రితం మొద‌లు పెట్టారు. అది ఇప్ప‌టికి పూర్త‌యింది.

దీంతో అక్టోబ‌ర్ 1న భారీ స్థాయిలో ప్రారంభించ‌బోతున్నారు. దీని కోసం రాజ‌కీయ ప్ర‌ముఖులు,. మెగాస్టార్ చిరంజీవితో పాటు అల్లు అర‌వింద్ కు చెందిన ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంతా పాల్గొన‌నున్నార‌ట‌. ఇక ఇదే స్టూడియోలో భారీ స్థాయిలో 'పుష్ప 2' రెగ్యుల‌ర్ షూటింగ్ ని లాంఛ‌నంగా ప్రారం భించ‌నున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.