Begin typing your search above and press return to search.

మెట్రో రైలు కోసం `మెగా`హీరో వెయిటింగ్!

By:  Tupaki Desk   |   28 Nov 2017 8:36 AM GMT
మెట్రో రైలు కోసం `మెగా`హీరో వెయిటింగ్!
X
హైద‌రాబాద్ లో తెలంగాణ స‌ర్కార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన మెట్రోరైలు నేడు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేతుల మీదుగా మియాపూర్ లో అట్ట‌హాసంగా ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. మెట్రో రాక‌తో ట్రాఫిక్ తిప్ప‌లు త‌ప్పుతాయ‌ని హైద‌రాబాద్ న‌గ‌ర‌వాసులు ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. అయితే, మెట్రోలో ప్ర‌యాణించేందుకు సామాన్యుల‌తో పాటు కొంత‌మంది సెల‌బ్రిటీలు కూడా చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ హైద‌రాబాద్ మెట్రోలో ప్ర‌యాణించేందుకు ఎదురు చూస్తున్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా శిరీష్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

త‌న‌కు మెట్రో రైల్లో ప్ర‌యాణించ‌డ‌మంటే చాలా ఇష్ట‌మ‌ని శిరీష్ ట్వీట్ చేశాడు. 2016లో బెంగుళూరు మెట్రో స్టేష‌న్ లో దిగిన ఫొటోను శిరీష్ ట్వీట్ చేశాడు. దేశంలోని, ప్ర‌పంచంలోని వివిధ మెట్రో రైళ్ల‌లో ప్ర‌యాణించానని, హైద‌రాబాద్ లో మెట్రో రైలు ప్రారంభం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాన‌ని అన్నాడు. గౌర‌వం సినిమాతో తెరంగేట్రం చేసిన శిరీష్ ఆ త‌ర్వాత కొత్త‌జంట‌ - శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు చిత్రాల‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం శిరీష్ ....వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక్క క్ష‌ణం అనే సినిమాతో త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమాతో మంచి హిట్ ను అందుకోవాల‌ని అల్లువార‌బ్బాయి తెగ క‌ష్ట‌ప‌డుతున్నాడ‌ని టాక్‌.