Begin typing your search above and press return to search.

కొత్త దర్శకుడికి మూడో ఆశాభంగం

By:  Tupaki Desk   |   16 April 2017 7:53 AM GMT
కొత్త దర్శకుడికి మూడో ఆశాభంగం
X
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి చాలామంది కొత్త దర్శకులే వస్తుంటారు. ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు మరికొందరు. కానీ ఒకే దర్శకుడికి మూడు సార్లు ఒకే అనుభవం.. అది కూడా మూవీ అనౌన్స్ మెంట్ కూడా వచ్చాక ఆగిపోవడం ఆశ్చర్యకరం.

ఎంవీఎన్ రెడ్డి అనే న్యూకమర్ తో అల్లు శిరీష్ హీరోగా ఓ ప్రాజెక్టును గతేడాదే అనౌన్స్ చేశారు. ఇప్పటివరకూ ప్రారంభమే కాలేదు సరి కదా.. ఇప్పుడు పూర్తిగా దీన్ని పక్కన పెట్టేశారట. నిజానికి వేణు మల్లిడి అనే దర్శకుడే ఈ ఎంవీఎన్ రెడ్డి కూడా. మొదట నితిన్ హీరోగా ఇతని దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది. అది ఆగిపోగా.. రామ్ హీరోగా ఓ మూవీ చేసే అవకాశం అందుకున్నాడు ఎంవీఎన్ రెడ్డి. ఆ ప్రాజెక్టు కూడా కార్యరూపం దాల్చలేదు.

ఇప్పుడు అల్లు శిరీష్ మూవీకి గీతాఆర్ట్స్ నుంచి బడ్జెట్ సమస్యలు వచ్చాయట. గీతా ఆర్ట్స్ కు బడ్జెట్ ప్రాబ్లెం అంటే నమ్మడం కష్టమే కానీ.. ఎంవీఎన్ రెడ్డి ప్రాజెక్టుకు గ్రాఫికల్ వర్క్ చాలా చేయాల్సి ఉంటుందట. అందుకే ఈ సినిమాను పక్కన పెట్టేశారని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/