Begin typing your search above and press return to search.

'పుష్ప' కోసం బన్నీ దిగొస్తున్నాడా...?

By:  Tupaki Desk   |   21 Jun 2020 3:30 PM GMT
పుష్ప కోసం బన్నీ దిగొస్తున్నాడా...?
X
స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో 'పుష్ప' అనే సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. బన్నీ - సుక్కు కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా 'రంగస్థలం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ రూపొందిస్తున్న సినిమా కావడం.. 'అల వైకుంఠపురంలో' సినిమా తర్వాత బన్నీ నటిస్తున్న సినిమా కావడంతో అందరూ ఈ మూవీ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా వారు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ కావడంతో పలువురు ఇతర ఇండస్ట్రీల నటీనటులు కూడా 'పుష్ప'లో నటిస్తున్నారని సమాచారం. ఇప్పటి వరకు టాలీవుడ్ మాలీవుడ్ శాండిల్ వుడ్ లపై ఫోకస్ పెట్టిన బన్నీ ఈ సినిమాతో కోలీవుడ్ బాలీవుడ్ లపై దృష్టి సారిస్తున్నాడు.

ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం అల్లు అర్జున్ భారీగానే డిమాండ్ చేసాడట. బన్నీ గత చిత్రం 'అల వైకుంఠపురంలో'కి సుమారు 25 కోట్లు తీసుకోవడంతో పాటు తన ప్రొడక్షన్ హౌస్ అయిన గీతా ఆర్ట్స్ సినిమాకి వచ్చిన లాభాల్లో వాటా తీసుకుందట. ఈ క్రమంలో 'పుష్ప' సినిమా కోసం బన్నీ 35 కోట్ల వరకూ డిమాండ్ చేసాడట. అంతేకాకుండా ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్న బన్నీ రిలేటివ్స్ కి కూడా లాభాల్లో వాటా ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నారట. అయితే అనుకోకుండా వచ్చిన కరోనా మహమ్మారి కారణంగా ఇండస్ట్రీ లెక్కల్లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ నేపథ్యంలో 'పుష్ప' టీమ్ కూడా బడ్జెట్ తగ్గించుకునే ఆలోచన చేస్తోందట. అలానే బన్నీ కూడా తన రెమ్యూనరేషన్ తగ్గించుకునే ఆలోచనలో ఉన్నాడట. కాగా శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న 'పుష్ప' షూటింగ్ ఇప్పట్లో స్టార్ట్ చేసే అవకాశాలు లేవని తెలుస్తోంది. రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతుండటంతో మరికొన్ని రోజులు వేచి చూసే ధరణిలో ఉండాలని 'పుష్ప' టీమ్ నిర్ణయించుకుందట. అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ లో సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.