Begin typing your search above and press return to search.

మాస్ డైరెక్ట‌ర్ తో బ‌న్నీ సినిమా షురూ

By:  Tupaki Desk   |   8 Jan 2022 3:30 PM GMT
మాస్ డైరెక్ట‌ర్ తో బ‌న్నీ సినిమా షురూ
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన తొలి పాన్ ఇండియా మూవీ `పుష్ప - ది రైజ్‌`. సుకుమార్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ మూవీ గ‌త ఏడాది చివ‌ర్లో డిసెంబ‌ర్ 17న విడుద‌లై సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ద‌ర్శ‌కుడు కూడా ఊహించ‌ని రీతిలో ఈ మూవీ రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని సాధిస్తున్న విష‌యం తెలిసిందే. తెలుగు, త‌మిళ భాష‌ల్లో మిన‌హా ఈ మూవీ ఫ‌లితంపై ద‌ర్శ‌కుడు సుకుమార్ కి అంతగా న‌మ్మ‌కం లేదు. కానీ అనూహ్యంగా ఈ మూవీ ఐదు భాష‌ల్లో ఇర‌గ‌దీసేస్తోంది.

బాక్సాఫీస్ ని షేక్ చేసేస్తోంది. ఇప్ప‌టికే 350 కోట్ల మార్కుని దాటి ట్రేడ్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన ఈ మూవీ ఉత్త‌రాదిలోనూ సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇదిలా వుంటే జ‌న‌ప‌వ‌రి 7న `పుష్ప - ది రైజ్` ఓటీటీలో విడుద‌లైంది. హిందీ వెర్ష‌న్ మిన‌హా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ వెర్ష‌న్ ల‌ని విడుద‌ల చేశారు. హిందీ వెర్ష‌న్ ని మాత్రం హోల్డ్ లో పెట్టేశారు.

కార‌ణం ఉత్త‌రాది ప్రేక్ష‌కులు ఈ మూవీకి బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతుండ‌ట‌మే. ఇదిలా వుంటే త్వ‌ర‌లోనే ఈ మూవీకి సంబంధించిన పార్ట్ 2 ప‌నులు ప్రారంభం కాబోతోతున్నాయి. స్క్రిప్ట్ వ‌ర్క్ ని మార్చికి పూర్తి చేసి మూవీని సెట్స్ పైకి తీసుకురావాల‌ని ద‌ర్శ‌కుడు అప్పుడే పనులు మొద‌లుపెట్టారు. ఇదిలా వుంటే అల్లు అర్జున్ మాస్ డైరెక్ట‌ర్ తో మూవీని షురూ చేసేశాడు. గ‌త కొన్ని రోజులుగా బ‌న్నీ `పుష్ప‌` త‌రువాత హైవోల్టేజ్ మాస్ మ‌సాలా యాక్ష‌న్ చిత్రాల ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను డైరెక్ష‌న్ లో ఓ మూవీ చేయ‌బోతున్న‌ట్టుగా ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.

తాజాగా ఈ మూవీ ప‌క్కాగా ఓకే అయిపోయింది. ఈ మూవీని స్టార్ ప్రొడ్యూస‌ర్, మాస్ట‌ర్ మైండ్ అల్లు అర‌వింద్ గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ పై అత్యంత భారీ స్థాయిలో నిర్మించ‌బోతున్నారు. ఇందు కోసం ప్ర‌త్యేకంగా ద‌ర్ధ‌కుడు బోయ‌పాటికి ఆఫీస్ ని కూడా కేటాయిస్తున్నార‌ట గీతా ఆర్ట్స్ వ‌ర్గాలు. దీంతో బ‌న్నీ - బోయ‌పాటి సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు షురూ అవుతున్నాయ‌ని చెబుతున్నారు. గతంలో అల్లు అర్జున్‌, బోయ‌పాటి శ్రీ‌నుల కాంబినేష‌న్ లో `స‌రైనోడు` మూవీ వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొందిన ఈ మూవీ బ‌న్నీని వంద కోట్ల క్ల‌బ్ లో చేర్చింది. మ‌రోసారి క‌లిసి చేయ‌బోతున్న సినిమా అంత‌కు మించి వుంటుంద‌ని, ఇందు కోసం బోయ‌పాటి భారీ స్కెచ్ ని సిద్ధం చేసిన‌ట్టుగా చెబుతున్నారు. గీతా ఆర్ట్స్ వ‌ర్గాలు ప్ర‌త్యేకంగా ఆఫీస్ ని కేటాయించిన త‌రువాత ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ ని బోయ‌పాటి టీమ్ ఫుల్ జోష్ తో పూర్తి చేస్తుంద‌ని, ఆ త‌రువాతే ఈ మూవీ ప‌ట్టాలెక్కుతుంద‌ని తెలుస్తోంది.