Begin typing your search above and press return to search.

సుకుమార్ తో ఆ డేంజర్ ఉందండోయ్!

By:  Tupaki Desk   |   25 Dec 2021 10:41 AM GMT
సుకుమార్ తో ఆ డేంజర్ ఉందండోయ్!
X
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో 'పుష్ప' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 17వ తేదీ నుంచి తన దూకుడును మొదలు పెట్టేసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా ఫస్టు వీక్ లోనే 229 కోట్ల రూపాయల గ్రాస్ ను రాబట్టింది. తొలి ఆటతోనే ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో. సుకుమార్ టీమ్ అలర్ట్ అయింది. వెంటనే సక్సెస్ పార్టీ పేరుతో ఏరియాల వారీగా సినిమాకి హైప్ తీసుకుని వచ్చారు.

తాజాగా ఇంటర్వ్యూలో ఈ సినిమా టీమ్ పాల్గొంది. అల్లు అర్జున్ మాట్లాడుతూ .. "నేను ఈ సినిమాలో చిత్తూరు యాసలో మాట్లాడవలసి ఉంటుందని సుకుమార్ చెప్పాడు. ఏదైనా ఒక డైలాగ్ ఇస్తే దానిని ఆ యాసలో చెప్పేయవచ్చు అనుకున్నాను. కానీ షూటింగు స్టార్ట్ చేయడానికి ముందే నాకు ఏమని అనిపించిందంటే, సుకుమార్ కచ్చితంగా లాస్ట్ మినిట్ లో డైలాగులు మార్చేస్తాడు. ఆయనతో కలిసి నేను పని చేసి కూడా పదేళ్లు అవుతోంది కాబట్టి .. ఈ మధ్యనే చరణ్ 'రంగస్థలం' చేసి ఉన్నాడు కనుక తనని అడిగాను.

అవును స్పాట్ లో అప్పటికప్పుడు ఆయన డైలాగ్స్ మార్చేస్తాడు అని చరణ్ చెప్పాడు. ఇక సమంతని అడిగితే ఆమె కూడా అదే మాట చెప్పింది. సుకుమార్ తో ఈ డేంజర్ ఉండనే విషయం నాకు అర్థమైపోయింది. ఇచ్చిన డైలాగ్ చెప్పేద్దామని అనుకుంటే చాలా కష్టం .. మనకి ఆ లాంగ్వేజ్ వచ్చి ఉండాలనే విషయం నాకు తెలిసిపోయింది. సుకుమార్ డైలాగ్ పేపర్ ఇచ్చేసి చెప్పమని అంటాడు .. అప్పుడు ఆ స్లాంగ్ లో నేను చెప్పగలిగి ఉండాలి. అందువలన నేను ముందుగానే ప్రిపేర్ కావడం మొదలుపెట్టాను.

చిత్తూరు యాసలో నేను పెర్ఫెక్ట్ కావడానికి లాక్ డౌన్ సమయం కూడా నాకు బాగా కలిసొచ్చింది. ఆ మూడు నాలుగు నెలల సమయంలో నేను ఆ యాసపై సాధన చేస్తూనే ఉన్నాను. ఇక సుకుమార్ కూడా ఈ యాసపై మామూలు కసరత్తు చేయలేదు. ఆయనకి ఇలా ఒక ఎర్రచందనం బ్యాక్ డ్రాప్ లో 'పుష్ప' అనే సినిమా చేయాలనే ఆలోచన రావడమే విశేషం. ఆయన కథ చెబుతున్నప్పుడే నేను ఈ సినిమాను చూసేశాను. 'పుష్ప' క్యారెక్టర్ పవర్ తగ్గకుండా .. ఒక అమ్మాయి విషయంలో ఆయన ఇన్నోసెన్స్ దెబ్బతినకుండా సుకుమార్ ఆ పాత్రలను డిజైన్ చేసిన తీరు సూపర్బ్" అంటూ చెప్పుకొచ్చాడు.