Begin typing your search above and press return to search.

శాంతా క్లాజ్ గా మాారిన బన్నీ.. సంబరాల్లో బాలుడు

By:  Tupaki Desk   |   25 Dec 2020 2:30 PM GMT
శాంతా క్లాజ్ గా మాారిన బన్నీ.. సంబరాల్లో బాలుడు
X
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా శాంతా క్లాజ్ మోసుకొచ్చే బహుమతులు చిన్నారుల కళ్లలో మిలియన్ల కొద్దీ మెరుపుల్ని పూయిస్తాయి. ముఖంలో వర్ణించలేని ఆనందాన్ని ఆవిష్కరిస్తాయి. స్టయిలిష్ స్టార్ బన్నీ కూడా ఈ క్రిస్మస్ కు శాంతా క్లాజ్ అయ్యాడు. ఓ చిన్నారికి ఊహించని గిఫ్ట్ ఇచ్చి, సంతోషంలో ముంచేశాడు.

వరుణ్ సందేశ్ భార్య వితికా షేరు ఇటీవల ఒక అనాథాశ్రమానికి వెళ్లారు. క్రిస్మస్ పండగకు పిల్లలకు ఎలాంటి బహుమతులు కావాలంటూ ఒక వీడియో షూట్ చేశారు. అయితే.. అక్కడ ఓ బాలుడు ఆమెను ఆశ్చర్యపరిచే బహుమతి అడిగాడు. ఈ క్రిస్మస్ కు గిఫ్ట్ గా తనకు అల్లు అర్జున్ ఆటో గ్రాఫ్ కావాలని అడిగాడు. అదే తనకు అసలైన బహుమతి అన్నాడు ఆ బాలుడు.

దీంతో.. ఈ విషయాన్ని బన్నికి తెలియజేస్తూ.. అప్పట్లోనే వితికా షేరు ట్విట్టర్ లో ఆ వీడియో పోస్ట్ చేసింది. దీనికి అల్లు అర్జున్ ను ట్యాగ్ చేసింది. ‘అల్లు అర్జున్ గారు.. ఈ బాలుడు మీకు పెద్ద ఫ్యాన్. ఇతను మీ ఆటో గ్రాఫ్ ను బహుమతి కోరుతున్నాడు. ఈ క్రిస్మస్ కు మీరు ఈ బాలుడి శాంతా క్లాజ్ అవుతారా?’ అంటూ ట్వీట్ చేసింది.

దీనికి స్పందించిన అల్లు అర్జున్.. తన వీరాభిమాని కల నెరవేర్చి శాంతా క్లాజ్ అయ్యాడు. తన ఆటో గ్రాఫ్‌తోపాటు, పలు బహుమతులను పిల్లలకు పంపించారు బన్నీ. వీటిని కూడా బన్నీ కుమారుడు అల్లు అయాన్‌ స్వయంగా తీసుకెళ్లి అందించాడు. అక్కడి పిల్లలతో కలిసి క్రిస్మస్‌ సెలబ్రేట్‌ చేసుకున్నారు. దీంతో ఆశ్రమంలోని బాలబాలికలు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. ‘థ్యాంక్యూ బన్నీ అన్నా’ అంటూ తమ అభిమాన హీరోకు ధన్యవాదాలు తెలిపారు.

కాగా.. బన్నీ పిల్లలు అర్హ, అయాన్‌ ఇద్దరూ కూడా సోషల్ మీడియాలో తండ్రితో పోటీపడుతూ మరీ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. తాజాగా క్రిస్మస్ ట్రీని అలంకరించి మురిసిపోతున్న అర్హ ఫోటోలను అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేవారు. ఈ వీడియోకు లక్షల సంఖ్యలో వ్యూస్ వచ్చాాయి. ఈ విధంగా ఇప్పటి నుంచే అల్లు పిల్లలు ట్రెండింగ్ లో ఉంటున్నారు.